‘పరుగెత్తే నీటికి నడక నేర్పు.. నడిచే నీటికి నిలకడ నేర్పు..’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో యేటా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతోంది. గుట్టలు, కొండలు, వాగులు, వంకలు అధికంగా ఉండడంతో నీరు వృథాగా పోతున్నది. ఈ నీటిని ఒడిసి పట్టడానికి మొదటి విడుతగా రూ.126.48 కోట్లతో 47 చెక్ డ్యాంలు నిర్మించింది. ఫలితంగా 8,819 ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. మొదటి విడుత ఫలితాలివ్వడంతో.. తాజాగా రూ.69.86 కోట్లతో 19 చెక్డ్యాంలను నిర్మించాలని నిధులు మంజూరు చేసింది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగు నీటికి ఢోకా ఉండదు. రెండు పంటలు సాగు చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్, ఆగస్టు 10 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు పండించేవారు. జిల్లాలో పెన్గంగ ప్రవా హం ఉన్నా, ఎక్కువ వర్షపాతం నమోదైనా నీటిని రైతుల సాగుభూములకు అందించడంలో గత పా లకులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. సరిపడా వర్షాలు పడితే కానీ పంట చేతికి వచ్చేది కాదు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాలోని రైతులకు సాగునీరు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలను చేపట్టింది. సాత్నాల ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతున్నది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 208 చెరువులకు మరమ్మతులు చేపట్టగా, 45 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. గత ప్రభుత్వాలు జిల్లాలో పుష్కలంగా నీటిని నిల్వచేసే అవకాశాలున్నా పట్టించుకోలేదు. దీంతో వానకాలంలో వర్షాలు పడినప్పుడు నీరంతా వృథాగా పోయేది. ఫలితంగా ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాలు అడుగంటి సాగు, తాగునీటికి ప్రజ లు ఇబ్బందులు పడేవారు. దీనిని నివారించేందుకు వర్షపు నీరు వృథాగా పోకుండా రైతులు, స్థానికుల కు ఉపయోగపడడంతో పాటు పశువులకు తాగునీరు లభించేలా చెక్డ్యాంలను నిర్మించింది.
రెండో విడుతలో 19 చెక్డ్యాంలు
జిల్లాలో ఏటా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. సీజన్లో ఇప్పటి వరకు 635.7 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 814 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఎత్తయిన ప్రాంతాలు, గుట్టలు, వాగులు, వంకల ద్వారా వర్షపునీరు వృథాగా పోతుంది. ‘పరిగెత్తే నీటికి నడక నేర్పు.. నడిచే నీటికి నిలకడ నేర్పు’ అనే నినాదం తో జిల్లాలో ప్రభుత్వం చెక్డ్యాం నిర్మాణాలకు శ్రీ కారం చుట్టింది. ఇందులో జిల్లాలో మొదటి విడుతలో రూ.126.48 కోట్లతో 47 చెక్డ్యాంల ను ని ర్మించింది. ఒక్కో చెక్డ్యాం నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల చొప్పున రూ.126.48 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో వాటి నిర్మాణాలు పూర్తవగా, 8,819 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. మొదటి విడుత చెక్డ్యాంలు మంచి ఫలితాలివ్వడంతో రెండో విడుతలో మరిన్ని నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో జిల్లాలో రూ.69.86 కోట్లతో 19 చెక్డ్యాంలను ప్ర భుత్వం మంజూరు చేసింది.
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల మండలం దహెగాంలో చెక్డ్యాం నిర్మాణం కోసం రూ.2.57 కోట్లు, కొబ్బాయిలో రూ.1.93 కోట్లతో జైనథ్ మండలం తర్నం వద్ద నిర్మాణం కోసం రూ.10.35 కోట్లు, ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట వద్ద రూ.2.64 కోట్లు, ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ మండలం హస్నాపూర్ వద్ద నిర్మాణం కోసం రూ. 2.50 కోట్లు, రామలింగం పేట వద్ద నిర్మాణ కోసం రూ. 2.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బోథ్ నియోజకవర్గంలోని భీంపూర్ మండలం కామట్వాడలో చెక్డ్యాం నిర్మాణం కోసం రూ.2.75 కోట్లు, సిరికొండ మండలం రాంపూర్కు రూ.3.18 కోట్లు, ఇచ్చోడ మండలం సిరిచెల్మకు రూ.2.93 కోట్లు, బాబ్జిపేటకు రూ.8.41 కోట్లు, గుడిహత్నూర్ మండలం ఉమ్రికి రూ.3.25 కోట్లు, శాంతాపూర్కు రూ.4.08 కోట్లు, బెల్లురికి రూ. 3 కోట్లు, బోథ్ మండలం పొచ్చరకు రూ.4.15 కోట్లు, మర్లపల్లికి రూ.1.80 కోట్లు, నేరడిగొండ మండలం వాంకిడికి రూ.4.12 కోట్లు, బోరిగామకు రూ.2.34 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించనున్నారు. వీటి నిర్మాణంతో రైతులు రెండు పంటలు సాగుచేసే అవకాశం లభిస్తుండగా, భూగర్భజలాలు పెరిగి ఎండాకాలం తాగునీటి కొరత తీరనున్నది.
ముథోల్ నియోజకవర్గానికి రూ.30 కోట్లు..
భైంసా, ఆగస్టు 10: నియోజకవర్గంలో నాలుగు చెక్డ్యాంల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం రాత్రి నీటి పారుదలశాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. భైంసా మండలంలోని కామోల్ చెక్డ్యాం నిర్మాణానికి రూ.6 కోట్ల 75 లక్షల 20 వేలు, లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ చెక్డ్యాం నిర్మాణానికి రూ.8 కోట్ల 50 లక్షల 90 వేలు, పొట్పెల్లి చెక్డ్యాం నిర్మాణానికి రూ.6 కోట్ల 70 లక్షల 50 వేలు, సాత్గాం చెక్డ్యాం నిర్మాణానికి రూ.8 కోట్ల 27 లక్షల 90 వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు వివరించారు. నియోజకవర్గానికి మొత్తం రూ.30 కోట్ల 24 లక్షల 50 వేలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వినియోగంలో ఉన్న గడ్చాంద, కనకాపూర్, పంచగుడి, బాసర, డొంగుర్గాం లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ఆధునీకరణకు సాంకేతిక అనుమతులు పూర్తయ్యాయని, ఈ పథకాలకు కూడా త్వరలోనే నిధులు మంజూరవుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతు శ్రేయస్సు కోసం అహర్నిశలు పాటుపడుతున్నదని పేర్కొన్నారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.