ఎదులాపురం, మార్చి 4 : మనిషిని మార్చేశక్తి ఒక మహిళకే ఉందని, ఇందుకు పరివర్తన మార్పు అవసరమని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీత అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలున్నాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గర్భంలో ఉన్న శిశువు నుంచి చ నిపోయే వరకు మహిళకు అనేక రకాల రక్షణ చ ట్టాలున్నాయని తెలిపారు. ఆడ, మగ ఇద్దరు తమ బాధ్యతలు మరిచిపోవద్దన్నారు. చిన్నచిన్న విషయాలను పెద్దగా చేసుకోవద్దని సూచించారు. అ నంతరం వివిధ రంగాల్లో రాణించిన అధికారులు తమ అనుభవాల్ని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు డీ మాధవికృష్ణ, ప్రమీలాజైన్, మంజుల, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేశ్, మహిళా ఎస్ఐలు బీ పెర్సిస్, రాధి క, అంజమ్మ, ఏఎస్ఐలు సునీత, అనిత, సవిత, జయలక్ష్మి, వెంకమ్మ, సఖీ కేంద్రం నిర్వాహకురా లు సరస్వతి, ఆర్టీసీ డీఎం కల్పన, న్యాయవాదు లు మంజులత, ఉమేశ్ డోలే, వివిధ శాఖల నుంచి వచ్చిన మహిళా సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.