హాజీపూర్, ఆగస్టు 15 : స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. పంద్రాగస్టు వేడుకలను జిల్లాలో ఘనం గా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో భారతీ హోళికేరి జెండా ఎగురవేశారు.
హాజీపూర్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు, ఆయా కార్యాల యాల్లో తహసీల్దార్ రాయలింగు, ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, జడ్పీటీసీ పూస్కూరి శిల్ప, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, ఎస్సై ఉదయ్కిరణ్, 13వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కమాండెంట్ రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఆయా కార్యాలయాల్లో నిర్వహించిన వేడుకల్లో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, జిల్లా సబ్ రిజిస్ట్రార్ మురళి, ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో మల్లయ్య, ఏపీఎం శ్రీనివాస్ గౌడ్, ఏవో రజిత, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్/ మంచిర్యాల అర్బన్ , ఆగస్టు 15: మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో, హమాలివాడలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ జెండా ఎగురవేశారు. గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ కార్యాలయం, పాత మంచిర్యాలలో చైర్మన్ పెంట రాజయ్య, ముఖరాం చౌరస్తా, రైల్వేస్టేషన్ చౌరస్తాలో మున్సిపల్ వైస్చైర్మన్ ముఖేశ్గౌడ్, వాటర్ట్యాంకు వద్ద మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఐబీలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి జాతీయ పతాకాలను ఎగురవేశారు.
జిల్లా కేంద్రంలోని కార్యాలయాల్లో డీఏవో కల్పన, డీఈవో వెంకటేశ్వర్లు, డీఐఈవో శైలజ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రవి కుమార్, డీఆర్డీఏ శేషాద్రి, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, జిల్లా మత్స్యశాఖ ఏడీ సత్యనారాయణ, డీడబ్ల్యూవో చిన్నయ్య, డీసీవో కృష్ణ, జిల్లా పశువైద్య, డీవీఏహెచ్వో డాక్టర్ శంకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కౌశిక వెంకట రమణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ఎక్సైజ్ సీఐ నరేందర్, మంచిర్యాలపశువైద్యాధికారి శంకర్ లింగం జెండా ఎగురవేయగా ఆయా శాఖల అధికారులు అనిత, శ్రీనివాస్, కవిత, కృష్ణ, సఫ్ధర్ అలీఖాన్, శ్రీనివాస్, మధుబాబు, సీసీ ఓంప్రకాశ్, సిబ్బంది విజయ్, గజానంద్ పాల్గొన్నారు. బీసీ జాగృతి కార్యాలయ ఆవరణలో జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి ప్రేంరావు, వివిధ సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు.
మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 15: జిల్లా అటవీ, రవాణ శాఖాధికారి కార్యాలయాల్లో డీఎఫ్వో శివాణి డోంగ్రే, ఎంవీఐ వివేకానందరెడ్డి జెండా ఎగురవేశారు.
జన్నారం, ఆగస్టు 15 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ కిషన్, పలు కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలు ఎగురవేశారు. ్ల ఎఫ్డీవో మాధవరావు, ఎంపీపీ మాదాడి సరోజన, జడ్పీ టీసీ ఎర్ర చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి పద్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, నాయకులు సిటిమల్ల భరత్కుమార్, మున్వర్అలీఖాన్, జక్కు భూమేశ్, జాడి గంగాధర్ పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, ఆగస్టు15 : లక్షెట్టిపేట కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, ఆయా కార్యాలయాల్లో సీఐ కరీముల్లాఖాన్, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, తహసీల్దార్ సతన్ కుమార్, ఎంపీపీ అన్నం మంగ, కేతిరెడ్డి సంధ్యారాణి, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, ఏవో ప్రభాకర్రెడ్డి, ప్రభుత్వ దవాఖాన సూపరిటెండెంట్ డాక్టర్ శేఖర్ జెండాలు ఎగురవేశారు. విద్యార్థులు ప్రభాత భేరి ర్యాలీ నిర్వహించారు.
దండేపల్లి మండలంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, తహసీల్దార్ పుప్పాల హన్మంతరావు, ఎస్ఐ సాంబమూర్తి, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, ఏవో అంజిత్ కుమార్ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, నాయకులు, అధికారులు హరితహారం నిర్వహించారు.
సీసీసీ నస్పూర్, ఆగస్టు 15: నస్పూర్కాలనీ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే దివాకర్రావు, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కమిషనర్ రాజు, సీసీసీ నస్పూర్ ఠాణాలో సీఐ తోట సంజీవ్, ఎస్ఐ శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య జెండాలను ఎగురవేశారు. నస్పూర్,శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్ వద్ద అధ్యక్షుడు భూపతి రవి, ఆర్కే-5కాలనీ మసీదు వద్ద అధ్యక్షుడు మహ్మద్ మౌలానా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.
చెన్నూర్/ చెన్నూర్ రూరల్, ఆగస్టు15: చెన్నూర్ పట్టణంతో పాటు మండలంలోని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ మంత్రి బాపు, వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, తహసీల్దార్ శ్రీనివాస్రావు దేశ్పాండే, పంచాయతీల్లో సర్పంచ్లు, అంగ్రాజ్పల్లి పీహెచ్సీ డాక్టర్ అరుణశ్రీ జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమా ల్లో జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో గంగా భవాని, ఏపీఎం ప్రమీల, ఎంపీవో అజ్మత్ అలీ, హెచ్ఈవో జగదీశ్, ఏఈవోలు సాగర్, రాజశేఖర్, వనాదేవి, దివ్య, నాయకు లు, పాల్గొన్నారు.
కోటపల్లి, ఆగస్టు 15 : కోటపల్లి మండలంలో ఎంపీపీ మంత్రి సురేఖ, తహసీల్దార్ సునీల్, సీఐ విద్యాసాగర్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, కోటపల్లి సర్పంచ్ రాగం రాజక్క, ఎంఈవో తిరుపతి రెడ్డి, పీహెచ్సీ డాక్టర్ సత్యనారాయణ, ఏవో మహేందర్, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బాణాల లక్ష్మీనారాయణ, కేజీబీవీ ఎస్వో హరిత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అంజన్ కుమార్, వెటర్నరీ డాక్టర్ పవన్ కుమార్, అంగన్వాడీ కేంద్రాల్లో సులోచన, రాజమణి జెండాలు ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అజ్గర్ మొహియొద్దీన్, ఎస్ఐ వెంకట్, ఎంపీడీవో భాస్కర్, ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్, ఎంపీటీసీ జేక శేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, మాజీ అధ్యక్షుడు బైస ప్రభాకర్, నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
జైపూర్, ఆగస్టు 15: మండలంలో ఎంపీపీ గోదారి రమాదేవి, తహసీల్దార్ మోహన్రెడ్డి, జైపూర్ ఏసీపీ జీ నరేందర్, ఏవో మార్క్గ్లాడ్సన్, ఏపీఎం రాజ్కుమార్, ఏఈవో కొమురయ్య జెండా ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మేడి సునీత, ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్ఐ రామకృష్ణ, వైస్ ఎంపీపీ పెద్దపల్లి రమేశ్, కోఆప్షన్ సభ్యుడు జైనుద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, చెన్నూర్ ఏఎంసీ ఉపాధ్యక్షుడు ఆర్నె సమ్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరవిందరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
భీమారం, ఆగస్టు 15: భీమారం మండలంలో ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ చెరుకు దీపికా రెడ్డి, సర్పంచ్ గద్దెరాంరెడ్డి, ఎస్ఐ సుధాకర్, తసీల్దార్ వాసంతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ కుమార్, ఏఈవో అరు ణ్ కుమార్, గుడిమల్ల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయ కుడు చెరుకు సరోత్తం రెడ్డి జెండా ఎగురవేశారు. కార్యక్రమా ల్లో కో ఆప్షన్ సభ్యుడు బాబర్ ఖాన్, భారతి భరోసా ఫౌండర్ చెరుకు భారతి, నాయకులు పోడెటి రవి, కట్ట నాగరాజు, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.
మందమర్రి, ఆగస్టు 15: మందమర్రిలో జడ్పీ సీఈవో కే నరేందర్, సీఐ ప్రమోద్రావు, ట్రాన్స్కో ఏఈ మహేందర్రెడ్డి, ప్రభుత్వ దవాఖాన డాక్టర్ శైలజ, అర్బన్ దవాఖాన డాక్టర్ శివప్రతాప్, వివిధ కాలనీల్లో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద, కుల సంఘాల నాయకులు జాతీయ పతాకాలను ఎగురవేశారు.
రామకృష్ణాపూర్, ఆగస్టు 15: క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్, ఎస్ఐ బీ అశోక్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ , ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో మందమర్రి సీఐ ప్రమోద్రావు, ఎస్ఐ చంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ విద్యాసాగర్రెడ్డి, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఆగస్టు 15 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, టీబీజీకేఎస్, తాపీ సంఘం భవనం, పలు పాఠశాలలు, వార్డుల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పలు కార్యాలయాల్లో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి గొల్ల హిమబిందు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎడ్ల మహేశ్, ఆర్డీవో శ్యామలాదేవి, తహసీల్దార్ కుమారస్వామి, శాంతిఖని గని ఆవరణలో ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వర్లు, సీఐ బాబురావు, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్రెడ్డి, వన్టౌన్ సీఐ ముష్కే రాజు, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆవుల అంజయ్య, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి టీ మణిరాంసింగ్ జెండా ఎగురవేశారు. పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. రామాయణం ఇంటర్నేషనల్ వండర్ బుక్ గ్రహీత వేముల మానసను తాజ్బాబా సేవా సమితి వ్యవస్థాపకులు ఉస్మాన్ పాషా,ఇస్మాయిల్ సన్మానించారు. కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, ఆగస్టు 15: మండలంలోని ఆయా కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ టీ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వెంబడి రాణి, ఎంపీడీవో డీ రాజేందర్,ఎంపీవో వీ శ్రీనివాస్, ఏపీవో ఎస్డీ జీనత్, తాళ్లగురిజాల పీహెచ్సీ డాక్టర్ డాక్టర్ అనీశ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఐకేపి సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.రాజేశ్వర్నాయక్, సీవోఈలో ప్రిన్సిపల్ ఐనాల సైదులు, బాలుర రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ శ్రీనివాస్, పంచాయతీల్లో సర్పంచ్లు జెండాలను ఎగురవేశారు.
తాండూర్, ఆగస్టు 15 : మండలంలోని ఆయా కార్యాలయాల్లో తహసీల్దార్ కవిత, ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, సీఐ జగదీశ్, ఎంఈవో వాసాల ప్రభాకర్, ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్, ఏవో కిరణ్మయి, సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కొడిప్యాక శ్రీనివాస్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రహమత్, ఆయా పార్టీల జెండా గద్దెల వద్ద నాయకులు జాతీయ జెండాలను ఎగుర వేశారు. పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్లు జెండాలు ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ సాలిగామ బానయ్య, బుగ్గ దేవస్థానం చైర్ పర్సన్ మాసాడి శ్రీదేవి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ దత్తాత్రేయరావు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, ఆగస్టు 15 : కన్నెపల్లి, భీమిని మండలాల్లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కన్నెపల్లిలో తహసీల్దార్ రాంచందర్, ఎంపీపీ సృజన, ఎస్ఐ సురేశ్, ఐకేపీ ఏపీఎం అశోక్, ఏవో శ్రీకాంత్, పంచాయతీలో సర్పంచులు , పాఠశాలల్లో హెచ్ఎంలు జాతీయ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ సత్యనారాయణ, ఎంపీడీవో రాధాకిషన్, ఎంపీవో సతీశ్, ఏపీవో శ్రీనివాస్, నాయకులు నర్సింగరావు, పుల్లూరి రాజయ్య, ఎంపీటీసీ భారతి, కో ఆప్షన్ సభ్యులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. భీమినిలో తహసీల్దార్ పరమేశ్వర్రెడ్డి, ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి, ఎస్ఐ వెంకటేశ్, ఏవో విజయ్, వెటర్నరీ డాక్టర్ సందీప్, పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఇన్చార్జి ఎంపీడీవో ఫణీంద్ర, ఎంపీవో ఆలీ, జడ్పీటీసీ గంగక్క, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాసిపేట, ఆగస్టు 15 : మండలంలోని ఆయా కార్యాలయాల్లో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, తహసీల్దార్ దిలీప్ కుమార్, ఎంఈవో దామోదర్రావు, పీఏసీఎస్ చైర్మన్ నీలా రాంచందర్, కాసిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూకట్ల రాజేశ్, జాగృతి అధ్యక్షుడు సోదారి సురేశ్, పంచాయతీల్లో సర్పంచులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండా ఎగరవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, ఎంపీడీవో ఎంఏ అలీం, సర్పంచ్లు ఆడె బాదు, దరావత్ దేవి, భూక్యా సునీత, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుర్గం పోశం, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
నెన్నెల,ఆగస్టు 15: మండలంలోని ఆయా కార్యాలయాల్లో ఎంపీపీ రమాదేవి, తహసీల్దార్ భూమేశ్వర్, ఎస్ఐ రాజశేఖర్, ఫారెస్ట్ రేంజర్ గోవింద్ సింగ్ సర్ధార్, ఎంఈవో నారాయణ, వెలుగు ఏపీఎం విజయలక్ష్మి, ఏడీఏ ఇంతియాజ్, నెన్నెల పంచాయతీలో సర్పంచ్ తోట సుజాత జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీటీసీలు తిరుపతి, హరీశ్ గౌడ్, కమల, టీఆర్ఎస్ నాయకులు ప్రతాపరెడ్డి, సాగర్గౌడ్, చీర్ల మొండన్న, ఇబ్రహీం పాల్గొన్నారు.
వేమనపల్లి, ఆగస్టు 15 : మండలంలోని ఆయా కార్యాలయాల్లో ఎంపీపీ ఆత్రం గణపతి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంఈవో తిరుపతిరెడ్డి, నీల్వాయి ఎస్ఐ నరేశ్, పీహెచ్సీ డాక్టర్ కృష్ణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్రావు, ఏఈవోలు సంతోష్, రుక్సార్ సుల్తానా, వెటర్నరీ డాక్టర్ చందన్కుమార్ జాతీయ పతాకాలను ఎగురవేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ స్వర్ణలత, ఎంపీవో శ్రీపతి బాపురావు, ఎంపీటీసీ సంతోష్కుమార్, సర్పంచ్ కుబిడె మధుకర్, టీఆర్ఎస్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, సక్కుబాయి, డిప్యూటీ తహసీల్దార్ సంతోష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలను జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగుర వేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు రెపరెపలా డాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, కూడళ్లు, పంచాయతీ కార్యాలయాలు, ఆయా పార్టీల జెండా గద్దెల వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు త్రివర్ణ పతాకాలను ఎగుర వేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు. విద్యా సంస్థల్లో వివిధ పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. పాఠశాలల విద్యార్థులు ప్రభాత భేరి ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై అంటూ నినదించారు.