మంచిర్యాల ఏసీసీ, ఆగస్టు 15 : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రైతు బంధుసమితి రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంచిర్యాలలోని హమాలీ వాడలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కలెక్టర్ భారతి హోళికేరి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ సోమవారం ప్రారంభించారు.
అనంతరం దవాఖానను పరిశీలించి అందించే వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్, నర్సు, అసిస్టెంట్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని డాక్టర్ సౌమ్య తెలిపారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ చైర్మన్ నడిపెల్లి విజిత్ రావు, ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్, కౌన్సిలర్లు నల్ల శంకర్, హరికృష్ణ, కమిషనర్ బాలకృష్ణ, డీఎంహెచ్వో సుబ్బారాయుడు, ప్రోగ్రాం అధికారి నీరజ, అల్లాడి శ్రీనివాస్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.