మంచిర్యాలటౌన్, ఆగస్టు 15 : వజ్రోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో 150 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ జెండా(32 ఫీట్ల పొడవు-48 ఫీట్ల వెడల్పు)ను ఎమ్మెల్యే దివాకర్, కలెక్టర్ భారతీహోళికేరి సోమవారం స్విచ్ నొక్కి ప్రారంభించారు. రూ. 26.50 లక్షల పట్టణ ప్రగతి నిధులతో ఈ భారీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జాతీయ పతాకం జిల్లాకే తలమానికంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.