జైపూర్, జూన్ 4: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్ర మం దేశానికే ఆదర్శమని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్ర భుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మండలంలోని టేకుమట్ల గ్రామంలో శనివారం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ని ర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రూ.23 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భ వనాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సర్పంచ్ గోనే సుమలత, ఎంపీటీసీ బడుగు రవి, జడ్పీటీసీ మేడి సునిత, ఎంపీపీ గోదారి రమాదేవి, వైస్ ఎంపీపీ పెద్దపెల్లి రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ గుండు తిరుపతి, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరా వు, డీఎల్పీవో ప్రభాకర్రావు, ఎస్ఈ శేషారావు రాథోడ్, డీఈ రాజన్న, ఏడీ రవికుమార్, ఎంపీడీవో సత్యనారాయణ, ఏఈ సదానందం, పార్టీ మండలాధ్యక్షుడు అరవిందరావు, ఏఎంసీ ఉపాధ్యక్షుడు ఆర్నె సమ్మయ్య, ఉప సర్పంచ్ లక్ష్మీనర్సయ్య, నాయకులు రిక్కుల మధుకర్రెడ్డి, బేతు తిరుపతిరెడ్డి, గూడెల్లి శ్రీనివాస్రెడ్డి, సురేందర్రెడ్డి, మేడి తిరుపతి, గోదారి లక్ష్మణ్ పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, జూన్ 4 : ఇతర రాష్ర్టాల్లోని ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. చెన్నూర్ మండలంలో 43, కోటపల్లిలో 8, భీమారం 13, జైపూర్ 19 మంది లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను అందజేశారు. ప్రతిపక్ష నేతల మాటలు నమ్ముకుంటే మన రాష్ట్రం మళ్లీ 70 ఏండ్లు వెనుకకు పోతుందన్నారు.
ఇటీవలి సర్వేలో టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని తేలిందని తెలిపారు. రైతు బంధు, కల్యాణలక్ష్మి పథకాలు చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెడుతున్న పథకాలకు ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని పే ర్కొన్నారు. ఎంపీపీ మంత్రి బాపు, మున్పిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజ్, జ డ్పీటీసీ మోతె తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, చెన్నూర్ మున్సిపల్ కౌన్సిల ర్లు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాల ప్ర జాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
చెన్నూర్ మండలం కిష్టంపేట డిగ్రీ కళాశాలలో ఉన్న ప్రత్యేకతలతో కూడిన వాల్ పోస్టర్లను ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విడుదల చేశారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వసతులు, సౌకర్యాలతో పాటు స్టడీ కోర్సుల వివరాలు ఈ పోస్టర్లలో పొందుపర్చినట్లు చెప్పారు. ఇటీవలే పలు పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చగా.. కళాశాల అధ్యాపకులను విప్ అభినందించారు. అనంతరం కళాశాల అధ్యాపకు లు బాల్క సుమన్ను శాలువాతో సన్మానించి, ప్ర పంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గులా బీ మొక్క బహూకరించారు. ప్రిన్సిపాల్ శ్రీదేవి, చెన్నూర్ తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్పాండే, వైస్ ప్రిన్సిపాల్ తిరుపతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
మందమర్రి, జూన్ 4 : మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎల్లవేళలా పాటుపడుతున్నదని ప్రభు త్వ విప్ బాల్క సుమన్ అన్నారు. స్థానిక సీఈఆర్ క్లబ్లో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు కులం, మతం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీఆర్ఎస్పై అక్కసు వెళ్లబోసుకుంటున్నాయన్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారని, వారికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఈ సందర్భంగా మందమర్రి పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో పాటు క్యాతన్పల్లి మున్సిపాలిటీకి చెందిన 187 మందికి కల్యాణలక్ష్మి, ఈద్ ముబారక్ చెక్కులను అందజేశారు. మొత్తం రూ.2,16,92,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. 31 మందికి రూ.1.52 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. తహసీల్దార్ శ్రీనివాస్, క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, ఎంపీపీ గుర్రం మంగ, జడ్పీటీసీ వేల్పుల రవి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.