కెరమెరి, మే 28: రైతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు ప్రణాళికతో పనులు చేపట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పెం దోర్ మోతీరాం అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య స మావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అ ధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయా శాఖల అధికారులు త మ నివేదికలు చదివి వినిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. నామమాత్రపు పనులు చేయకుండా ఆశించిన ఫలితా లు వచ్చేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
రైతు ల పురోభివృద్ధికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నాదని, వాటితో అన్నదాతకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వి ద్యుత్, వ్యవసాయ, ఐకేపీ, ఈజీఎస్, పశుపోషణ వంటి శాఖ లో అధికారులు చేపడుతున్న పనుల వివరాలను క్షుణ్ణంగా అడి గి తెలుసుకున్నారు. రైతులకు పెట్టుబడితో పాటు బోరుబావు లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ రైతులు ఎందుకు ప్రగతిబాట పట్టడం లేదని ప్రశ్నించారు. యేటా ఒకే పంటలు వేయకుండా ఇతర పంటలు సాగుచేసేలా రైతులను చైతన్యపర్చాలని సూచించారు.
అలాగే పాడి, పశు పోషణపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు మూడు నెలల నుం చి గ్రామపంచాయతీ అభివృద్ధికి చేసిన పనుల బిల్లులు రావడం లేదని సర్పంచ్లు నిరసన తెలుపుతూ సభనుంచి బయటికి వెళ్తున్నామని చెప్పగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ జోక్యం చేసుకొని సభలో తీర్మానం చేసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో సభ ప్రశాంతంగా కొనసాగింది. కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్, తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్, వైస్ ఎంపీపీ అబూల్ కలాం, వైద్యాధికారి వెంకటేశ్, ఎంఈవో సుధాకర్, ఏవో గోపీకాంత్, ఏఈలు శ్రీనివాస్, విశ్వేశ్వర్, ఎఫ్ఆర్వో జ్ఞానేశ్వర్, ఏపీవో నగేశ్, ఏపీఎం జగదీశ్, పశువైద్య సహయకురాలు సోనియాతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.