రెబ్బెన, మే 23: బెల్లంపల్లి ఏరియాకు సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు అధిగమించే చర్యలు తీసుకోవాలని జీఎం(సీడీఎన్) సూ ర్యనారాయణ అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని కైర్గూడ ఓసీపీ సందర్శించి, ఓబీ కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రతి పాదిత గోలేటి ఓసీ ప్రాంతాన్ని సందర్శించారు.
అనంతరం గోలేటి జీఎం కార్యాలయంలో సంబంధిత అధికారులకు సలహాలు సూచనలు చేశారు. ఏరియా లో ప్రారంభం కాబోతున్న గోలేటి ఓసీపీ, ఎంవీకే ఓ సీపీ సంబంధించిన సమాచారం అడిగి తెలుసుకోవడంతో పాటు పర్యారవణం, భూసేకరణ, అటవీ అనుమతులు త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏరియా జీఎం దేవేందర్, బీపీఏఓసీపీటూ ప్రాజెక్ట్ ఆధికారి చంద్రశేఖర్, ఎస్టేట్ మేనేజర్ వరలక్ష్మి ఉన్నారు.
మందమర్రి రూరల్ మే 23: ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ప్ర యత్నించాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకొని ముం దుకు సాగాలని సింగరేణి జీఎం (సీడీఎన్) సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన కేకే ఓసీని సదర్శించారు. అనంతరం ఉత్పత్తి ఉ త్పాదకత, రవాణాపై జీఎం చింతల శ్రీనివాస్, కేకే ఓసీ పీవో రమేశ్తో చర్చించారు.
ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల కారణంగా ఉత్పత్తిపై ప్రభా వం చూపే అవకాశం ఉంటుందన్నారు. కార్మికులు పూర్తి స్థాయిలో విధులకు హారయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కా ర్యక్రమంలో ఎస్వోటూ జీఎం గోపాల్ సింగ్, ఆర్కే ఓసీ ప్రాజెక్టు అ ధికారి మధుసూదన్, ఏజీఎం ఈఅండ్ఎం రాంమూర్తి, ఏజీఎం ఏజెం ట్ రాంచందర్, డీజీఎం ఐఈడీ రాజన్న, కాసిపేట గ్రూప్ ఏజెంట్ రా జేందర్ పాల్గొన్నారు.