కుభీర్, మే 23 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నూతన ఆలయాల నిర్మాణంతో పాటు పురాతన ఆలయాల పునరుద్ధరణకు పెద్దపీట వేశారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి స్పష్టం చే శారు. మండలంలోని రంగశివిని గ్రామంలో దే వాదాయశాఖ నిధులు రూ.10 లక్షలతో చేపట్టిన శివాలయ నిర్మాణ పనులకు సర్పంచ్ కదం ద త్తూరాం పటేల్తో కలిసి ఆయన భూమి పూజ చే శారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పడిన రంగశివిని గ్రామం రెండుమూడేండ్లలో ఎనలేని అభివృద్ధి సాధించిందన్నా రు. రోడ్లు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు నిధులు వెచ్చించామని తెలిపారు. అనంతరం ఎ మ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కం దుర్ సంతోష్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, వైస్ చైర్మన్ దిగంబర్ పటేల్, గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుంటాల, మే 23 : కుంటాల మండల కేంద్రంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో 142 మంది లబ్ధిదారులకు రూ. 1,42,16,472 విలువ గల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అంతకుముందు రూర్బన్ పథకం ద్వారా మహిళా సంఘాల అభివృద్ధికి కుంటాల, కల్లూర్లో ఏర్పాటు చేసిన పేప ర్ ప్లేట్ల తయారీ కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ కార్యాలయంలో ప్రభు త్వం అందిస్తున్న రాయితీ జీలుగ బస్తాలను రైతులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చి, రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు చేయూతనందిస్తున్నదని తెలిపారు. కుంటాల మండలాన్ని దశల వారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమతావెంకటేశ్, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, తహసీల్దార్ ఖలీమ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఏఎంసీ, మార్కెట్, సొసైటీల డైరెక్టర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
లోకేశ్వరం, మే 23 : లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే రైతులకు జీలుగ విత్తన బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో అందజేస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ అధ్యక్షడు లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, ఉపాధ్యక్షుడు నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచ్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భుజంగ్ రావు, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు కపిల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దిగంబర్, సోషల్ మీడియా అధ్యక్షుడు బండి ప్రశాంత్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ డైరెక్టర్లు, నాయకులు మెండే శ్రీధర్, నాలం గంగాధర్, సుదర్శన్ రెడ్డి, గన్ను నర్సారెడ్డి, పీఏసీఎస్ సీఈవో చిన్నయ్య, శ్రీనివాస్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.