నిర్మల్ టౌన్, మే 21 : తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రగతిలో నిర్మల్ జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ ఆడిటోరియం భవన్లో పల్లె ప్రగతి ఐదో విడుత అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, రేఖా నాయక్తో కలిసి పల్లె ప్రగతిలో మంచి ఫలితా లను సాధించి పల్లెలను అభివృద్ధి పథంలో నిలిపి న 11 మంది సర్పంచ్లు, నలుగురు ప్రజా ప్రతి నిధులు, అధికారులను శాలువలతో సత్కరించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూన్ 3 నుంచి 18 వరకు 15 రోజుల పాటు ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.
నిర్మల్ జిల్లాలోని 396 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు దేశం మెచ్చుకునేలా ఉన్నాయని గుర్తుచేశారు. ఈసారి పల్లె ప్రగతిలో మిగిలిపోయిన పనులను గుర్తించి చేపట్టాలన్నారు. హరితహారంలో మొక్కల సంరక్ష ణ, రోడ్లపై మొక్కలు నాటడం, పల్లెల్లో పరిశుభ్ర పనులు చేపట్టడం ప్రజలందరినీ భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్లను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సర్పంచ్లకు భరోసానిచ్చారు.పల్లె ప్రగతిలో పాల్గొనడానికి వచ్చిన సర్పంచ్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని గ్రామ పంచాయతీకి నిధులను ఎక్కువగా కేటా యించాలని కోరుతూ మంత్రితోపాటు జిల్లా కలె క్టర్, ఎమ్మెల్యేలను విన్నవించారు. మంత్రికి వినతి పత్రం అందించిన వారిలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, వీరేశ్, సర్పంచ్లున్నారు.
ఈ కార్యక్ర మంలో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీపీవో వెంకటేశ్వర్ రావు, డీఆర్డీవో విజయలక్ష్మి పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్పేట్ కాలనీలోని ఈడెన్ గార్డెన్లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు హజ్ సొసైటీ ఆధ్వ ర్యంలో శనివారం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరా నికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సేవలు అందిస్తున్నదని చెప్పారు.
హజ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం అభినందనీ యమని పేర్కొన్నారు. నిర్మల్లో స్థలం కేటాయిం చి హజ్ హౌస్ నిర్మిస్తామని పేర్కొన్నారు. నిర్మల్ మున్సి పల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు నజీరొద్ద్దీన్, ట్రైనర్లు అల్ హజ్ ఖాన్, ఖాజా ఆసిఫ్, ఖాజా వసీఫ్, మత గురువులు మౌలాన ముస్తఫా, మౌలానా ముష్కుర్ హైమద్ తదితరు లు పాల్గొన్నారు.