కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొత్త మత్స్యపారిశ్రామిక సంఘాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈసారి మహిళా మత్స్యకార సంఘాల ఏర్పాటుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. జిల్లాలోని 167 చెరువుల పరిధిలో సొసైటీల అ వసరం ఉంది. ప్రస్తుతం జిల్లాలో రిజిస్టర్ అయి న సొసైటీలు 35 మాత్రమే ఉన్నాయి. ఈ 35 సొసైటీల్లో 2,238 మంది సభ్యులు చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో కొత్త గా సొసైటీలు ఏర్పాటు చేయాల్సిన చెరువులు 167 ఉన్నాయి.
వీటిలో 100 చెరువులు మైదా న ప్రాంతాల్లో ఉండగా, మిగతా 67 చెరువులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతా ల్లో ఉన్న చెరువుల పరిధిలో గిరిజనుల ద్వారా మాత్రమే మత్స్యకార సొసైటీలు ఏర్పాటు చే యాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో 10 మాత్రమే గిరిజన సొసైటీలు మాత్రమే ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతానికి సం బంధించి కొత్తగా 12 దరఖాస్తులు రాగా, వీటి లో 3 సొసైటీల ఏర్పాటుకు అనుమతి వచ్చిం ది. మరో 5 దరఖాస్తులను రిజిస్ట్రేషన్ అనుమతి కోసం అధికారులు పంపించారు.
రిజిస్టర్ అయి న గిరిజన సొసైటీలోని సభ్యులకు అధికారులు చేపలు పట్టడంతో మెళకువలపై శిక్షణ కూడా కల్పిస్తారు. ఇక మైదాన ప్రాంతాల్లో కొత్తగా 100 చెరువుల పరిధిలో సొసైటీలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ఈ మైదాన ప్రాంతాల్లో అర్హులైన గూండ్ల, బెస్త, గంగపుత్ర, జడ, మత్తవాసి లేకపోవడంతో ఇప్పటి వరకు ఈ చెరువుల పరిధి నుంచి ఎలాంటి దరఖాస్తులు రాలేదని అధికారులు తెలిపారు.
ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. మత్స్యకార సొసైటీల ఏర్పాటులో కూడా మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తోంది. ఆసక్తిగల మహిళా సంఘాల ద్వారా దరఖాస్తులను స్వీకరించి సొసైటీని మ హిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నది.
పురుష మత్స్యకారులతో చెరువుల్లో, ప్రాజెక్టుల్లో చేపల ను పట్టించి మహిళా సొసైటీల ఆధ్వర్యంలో వా టిని మార్కెటింగ్ చేసే అవకాశం కల్పిస్తారు. చే పల మార్కెటింగ్ ద్వారా వచ్చే ఆదాయం మ హిళా సొసైటీలకు దక్కుతుంది. గ్రామాల పరిధి లో ఉన్న చేపల పెంపకం ద్వారా ఆ గ్రామంలో ని మహిళా సంఘాలకు ఆర్థికంగా భరోసా కలుగుతుంది.
గిరిజన మత్యకారుల సొసైటీల ఏర్పాటుపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇప్పటి వరకు డోర్పల్లి, కొహినూర్, రాఘాపూర్, కెస్లాగూడ, అనుకోడ, జంగాం గ్రామాల నుంచి గిరిజన మత్స్యకారుల సంఘాల కోసం దరఖాస్తులను అధికారులు స్వీకరించారు.
రిజిస్టర్ అయిన గిరిజన మత్స్యకార సంఘాల్లోని సభ్యులకు చేపలను వేటాడడంపై అధికారులు శిక్షణ కల్పించడంతోపాటు, ప్రభుత్వ పరంగా అన్ని వసతులు కల్పిస్తారు. చేపలు పట్టేందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 67 చెరువుల పరిధిలో గిరిజన మ త్స్యకారుల సొసైటీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో కొత్త మత్స్యకారుల సంఘాల ఏర్పాటుకు అర్హులైన వారు ఈనెల చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలో 167 చెరువుల పరిధిలో సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో 67 చెరువులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటి పరిధిలో గిరిజనుల సంఘాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. చేపలు పట్టేందుకు అవసరమైన మెళకువలు గిరిజనులకు నేర్పిస్తాం. మైదాన ప్రాంతాంలో సుమారు 100 చెరువుల పరిధిలో కొత్త పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.
ఈసారి మహిళా సంఘాలతో కూడా మత్యపారిశ్రామిక సంఘాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రిజిస్ట్రర్ అయిన మహిళా సంఘాలు పురుష మత్స్యకారులతో చేపలు పట్టించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపలను మార్కెటింగ్ చేసుకొని ఆర్థికంగా లాభాలు పొందవచ్చు.
– సాంబశివరావు, జిల్లా మత్యశాఖ అధికారి