నిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఈ నెల 7 తేదీన ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారంతో ముగిశాయని డీఐఈవో పరశురాం తెలిపారు. ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలకు మొత్తం 6668 మంది విద్యార్థులకు 6224 మంది హాజరు కాగా 444 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.
నిర్మల్లోని సిద్దార్థ, ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.
ఆదిలాబాద్రూరల్, మే 19 : ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలకు 9466 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.