కాగజ్నగర్ రూరల్, మే 18: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సిర్పూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప అన్నారు. బుధవారం కాగజ్నగర్ మండలంలోని చింతగూడలోని మండల పరిషత్ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యావిధానంలో అనేక మార్పు లు వచ్చాయన్నారు.
రాష్ట్రంలో కేజీబీవీ, ట్రైబల్వెల్ఫేర్, మహిళా డిగ్రీ కళాశాలలతో పాటు వందలాది కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘మన ఊరు-మనబడి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీఈవో అశోక్, కో ఆప్షన్ సిద్దిక్, ఎంపీపీ శంకర్, ఎంఈవో భిక్షపతి, సర్పంచులు సంజీవ్, లక్ష్మి, మాజీ ఎంపీటీసీ నాగేందర్,శ్యాంరావు, నాయకులు నారాయణ, మల్లేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
డబ్బా గ్రామంలో..చింతలమానేపల్లి , మే 18 : బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డబ్బా పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డబ్బా, బారెగూడ, బాబాసాగర్, చింతలమానేపల్లి, కర్జెవెల్లిలోని 5 పాఠశాలల్లో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, కాంపౌండ్వాల్, తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, నీటి వసతి, తదితర మౌలిక వసతులను కల్పించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ డుబ్బుల నానయ్య, జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఎంఈవో సోమయ్య , కో ఆప్షన్ సభ్యులు నాజీం హుస్సేన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డబ్బుల వెంకయ్య, గ్రామాల సర్పంచ్లు, ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులున్నారు.
బెజ్జూర్, మే 18 : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాధికారి రమేశ్ బాబుతో కలిసి ‘మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు. మండలంలో ఎన్ని పాఠశాలలలో అభివృద్ధి పనులు మంజూరయ్యాయని ఎంఈవో రమేశ్ బాబును అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మరుగు దొడ్లు సరిగ్గా లేవని ఎమ్మెల్యేకు విద్యార్థులు తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పర్వీన్ సుల్తానా, లంగారి శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ రాజు, సహకార వైస్ చైర్మన్ దందెర ఇస్తారి, నాయకులు డోకె వెంకన్న, జావీద్ అలీఖాన్, కొట్రంగి రామకృష్ణ, పుల్లూరి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూర్, మే 18 : సోమినిలో ఎస్సీ కమ్యునిటీ హాల్ కోసం రూ.11లక్షలు మంజూరు చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. బుధవారం బెజ్జూర్ మండలంలోని సోమిని లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి, ఆర్థిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు.
సోమినిలో హెల్త్ సబ్ సెంటర్ కావాలని, బెజ్జూర్ నుంచి సోమిని వరకు రోడ్డు నిర్మాణాలు చేపట్టి గూడెం మీదుగా మహారాష్ట్రలోని అహేరి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. అటవీశాఖ అనుమతులు లేకనే బెజ్జూర్ సోమిని రోడ్డు పనులు నిలిచి పోయాయని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్లతో పాటు రెండు వాగులపై వంతెన నిర్మాణాలు కూడా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సోమిని తలాయి గ్రామాల మధ్య హెలెవల్ వంతెన నిర్మాణం పూర్తి చేశామని, తలాయి నుంచి బెజ్జూర్ వయా పాపన్ పేట రోడ్డు పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. సబ్ సెంటర్ మంజూరుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిడం సకారాం, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, సర్పంచ్ ఎలాది శారద, కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, సహకార వైస్ చైర్మన్ దందెర ఇస్తారి, ఎంపీటీసీ లంగారి శ్రీనివాస్, సర్పంచ్లు తొర్రెం శంకర్, కుంరం హన్మంతు, ఉప సర్పంచ్ దుర్గం శంకర్, నాయకులు కుర్సింగ ఓంప్రకాశ్, డోకె వెంకన్న, జావీద్ అలీఖాన్, పుల్లూరి సతీశ్, సెగ్యం వినోద్, నైతం సత్తయ్య, జాడి లక్ష్మణ్, లింగాల శంకరయ్య, కొండ్ర బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.