భీంపూర్, మే 18 : వానకాలం సాగుకు భూమిని సిద్ధం చేసే క్రమంలో ట్రాక్టర్ బోల్తాపడింది. దీంతో డ్రై వర్తో పాటు సంబంధిత రైతు మృత్యువాతపడ్డారు. ఎస్హెచ్వో గోకుల్, గ్రామస్తులు తెలిపిన వివరాల మే రకు.. భీంపూర్ మండలం గోముత్రి గ్రామానికి చెం దిన రైతు పర్ధాన్ అశోక్ ( 35)కు గ్రామ శివారులో ఒకటిన్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో బుధవా రం రాజస్థాన్కు చెందిన డ్రైవర్ లోకేశ్తో ట్రాక్టర్తో దుక్కి పనులు చేయిస్తున్నాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ట్రాక్టర్పై రైతు అశోక్, డ్రైవర్ లోకేశ్ ఉన్నా డు. ట్రాక్టర్ చేను గట్టు అంచుకు వెళ్లి అనుకోకుండా అక్కడున్న పెద్ద గుంతలో బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో రైతు అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు . డ్రైవర్ లోకేశ్ ట్రాక్టర్ ముందరి చక్రాల కింద ఇరుక్కున్నాడు. విషయం తెలుసుకున్న పరిసర చేల రైతులు గమనించి సర్పంచ్ నిమ్మ వేణుయాదవ్కు సమాచారమిచ్చారు. అతికష్టం మీద డ్రైవర్ను బయటకు తీసి ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. డ్రైవర్ ఛాతికి, తల కు బలంగా దెబ్బలు తాకాయి. పరిస్థితి విషమించడం తో రిమ్స్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. భీంపూర్ ఎస్హెచ్వో గోకుల్ పంచనామా చేసి కేసు నమోదు చేసుకున్నారు.
రైతు పర్ధాన్ అశోక్ది చిన్నకారు రైతు కుటుంబం. నలుగురు అన్నదమ్ములకు చెరో 1.20 ఎకరాల భూమి ఉన్నది. భార్య పుష్పల. వీరికి సంతానం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతో తక్కువ భూమిలోనే కష్టపడి పంట పండించేవాడు.
ఉదయం ఇంట్లో భోజనం చేసి దుక్కి దున్నిస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఆ సమయంలో ఆయనతో బావమరిది, అన్నకుమారుడు కూడా చేను వరకు వచ్చారు. సా యంత్రం వస్తానన్న భర్త విగతజీవిగా మారడంతో భార్య విలపించిన తీరు కలిచివేసింది. ఈ ఘ టనతో గోముత్రిలో విషాద చాయలు అలుముకున్నాయి.
కాగా.. ఈ ప్రమాదం కంటే 10 నిమిషాల ముందు ఆ ట్రాక్టర్లో సరదాగా ఉన్న రైతు బావమరిది, అన్నకుమారుడు తమకు ఆకలేస్తోందని దిగిపోయారు. వారు వెళ్లిన కొద్ది సేపటికే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో వారిద్దరు ఈ పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయ్యింది.
ఇక్కడ వ్యవసాయ పనులు ఎక్కువగా ఉంటాయని కొన్నేళ్లు రాజస్థాన్ వారు వలస వస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్కు చెందిన మహిపాల్సింగ్ ట్రాక్టర్పై పనిచేసేందుకు లోకేశ్ వచ్చాడు. మూడు నెలల క్రితమే ఇక్కడికి వచ్చిన ఈయన.. గోముత్రిలో పనిచేస్తున్నాడు. ఈయనకు నెలకు రూ.15 వేల జీతం ఇస్తున్నారు.
రాజస్థాన్లోని జైపూర్ దగ్గరి కోడ్పురి గ్రామంలో ఉండే తల్లిదండ్రులకు నెలనెలా కొంత డబ్బు పంపేవాడు. అవివాహితుడైన లోకేశకు ఈ ఏడాది పెళ్లి చేస్తామని వారి సోదరుడు చెప్పాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని ట్రాక్టర్ యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రాజస్థాన్ తీసుకెళ్తామని చెప్పారు.