ఎదులాపురం,మే18 : ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్డడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా జిల్లాకు చెందిన నిరుద్యోగులకే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు.
తాను సర్పంచ్ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన కాలంలోనూ ఏ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినా ఉద్యోగులు ఇతర జిల్లాలకు చెందిన వారే ఉండేవారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటి సారి బీసీ స్డడీ సర్కిల్ భవనం రూ.3.70 కోట్లతో జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీబీసీడీవో రజాలింగం, స్డడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్, వార్డు కౌన్సిలర్ భరత్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ పాల్గొన్నారు.