కన్నెపల్లి, మే 16 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. కన్నెపల్లి మండలం కన్నెపల్లి, మెట్పల్లి, నాయకునిపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 24 గంటల కరంటు, రైతుబీమా, రైతుబంధు ఇచ్చి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.
పోలంపల్లి, వీరాపూర్లో ఆర్అండ్బీ రోడ్డు నుంచి గ్రామాల్లోకి వెళ్లే రహదారులను రూ. 1.30 కోట్ల సీఆర్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు. రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పోలంపల్లికి రూ. 70 లక్షలు, వీరాపూర్కు రూ. 60 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.
నాయకునిపేటలో కల్యాణ లక్ష్మి లబ్ధిదారు ఇంటికి ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి చెక్కు అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ, సర్పంచులు సురేఖ, అశోక్గౌడ్, పనాస అంజన్న, తిరుపతి, వైస్ ఎంపీపీ రాకేశ్శర్మ, ఎంపీటీసీలు భారతి, లతశ్రీ, టీఆర్ఎస్వై అధ్యక్షుడు మహేశ్గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్ గుప్తా, రంగారావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆకుతోట రాజన్న, తహసీల్దార్ రాంచందర్, తాండూర్ సీఐ జగదీశ్, ఎంపీడీవో రాధాకృష్ణ, ఏఈ రాంచందర్ పాల్గొన్నారు.