దళితుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు దళిత బంధు పథకం ప్రవేశపెట్టిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే అత్రం సక్కు అన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన యూనిట్లను జిల్లా కేంద్రంలో సోమవారం వారు అందజేశారు. మంజూరైన యూనిట్లను సక్రమంగా వినియోగించుకొని, ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
ఆసిఫాబాద్, మే 16: దళితబంధు పథకం ద్వారా దళితులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నా రు. జిల్లా కేంద్రంలో సోమవారం ఆసిఫాబాద్ ని యోజకవర్గం పలువురు దళితులకు దళితబంధు పథకంలో మంజూరైన యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ దళితుల అభ్యున్నతే ధ్యేయంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. లబ్ధిదారులు యూనిట్లను సక్రమంగా వినియోగించుకొని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్రావు, వేముర్ల సంతోష్, ఎంపీపీలు అరిగెల మల్లికార్జున్, పెందోర్ మోతీరాం, ఈడీ సంజీవ్, వివిధ శాఖల ఆధికారులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కాగజ్నగర్టౌన్, మే 16 : దళితులు ఆర్థికం గా ఎదిగేందుకే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పట్టణంలోని ఎస్పీఎం క్రీడా మైదానంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో దళిత బంధు లబ్ధిదారులకు సోమవారం ఆస్తులు పంపి ణీ చేశారు. నియోజకవర్గంలోని 50 మంది లబ్ధిదారులకు 30 ట్రాక్టర్లు, రెండు కార్లు, 12 ఆటోలు, 5 ఫోర్ వీలర్స్, బొలెరో వాహనాలను జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మితో కోన్పప్ప పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వాలు దళితులను పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ వారిని ఆర్థికంగా బలోపేతం చేసేం దుకు దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, ఎంపీపీ చీపిరిశెట్టి శంకర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు బసార్కర్ విశ్వనాథ్, ఎస్పీ కార్పొరేషన్ జిల్లా ఈడీ సంజీవ న్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనర్సింహం, అధ్యాపకులు దేవేందర్, వెంకటేశం, రాజశేఖర్, సుస్మ, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయ కులు, తదితరులు పాల్గొన్నారు.
వాంకిడి,మే16:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బందు పథకం దేశానికే ఆదర్శమని జడ్పీటీసీ అజయ్కుమార్ అన్నారు. మండలంలోని జైత్పూర్ గ్రామానికి దళిత బందు పథకం కింద ఎనిమిది యూనిట్లు మంజూరయ్యాయి. సోమవారం లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్, పెంటయ్య,లబ్దిదారులు,టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు ఉన్నారు.