దిలావర్పూర్, మే 16 : కాల్వ శ్రీ లక్ష్మీనృసింహుని కల్యాణం.. సోమవారం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా సా గింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు నిండిపోయాయి. ముందుగా ఉత్సవ విగ్రహాలను పల్లకీలో కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. స్వామివారికి రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించారు.
వారికి ఆలయ పండితులు, చైర్మన్, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు గరుడ ముద్దలను అందించారు. ఇబ్బందులు కలుగకుండాఅధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నదానం నిర్వహించారు. నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి దంపతులు, దిలావర్పూర్ ఎంపీపీ పాల్దే అక్షర దంపతులు, కాల్వ, కదిలి ఆలయ చైర్మన్లు చిన్నయ్య, భుజంగ్రావు, నిర్మల్ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ దర్మాజీగారి రాజేందర్ దంపతులు, ఆలయ డైరెక్టర్లు, నిర్మల్ డీఎస్పీ ఉపేందర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.