ఎదులాపురం / ఆదిలాబాద్ రూరల్, మే 16 : గౌతమ బుద్ధుడి మాటలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్ బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు. మొదటి బుద్ధ భగవాన్ ప్రతిమతోపాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకున్నారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. మొదట బౌద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ రోజును విశిష్టమైనదిగా కీర్తిస్తూ, బుద్ధుడి జన్మదినంతో పాటు మహా పరినిర్వన్ను ఒకేరోజు నిర్వహించడాన్ని బౌద్ధ పౌర్ణమిగా చేసుకుంటున్నామని తెలిపారు. ప్రతి మనిషిలోనూ సహాయపడే తత్వం అలవర్చుకోవాలన్నారు. దళిత సంఘం నాయకులు రత్న జాడే ప్రజ్ఞాకుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, కౌన్సిలర్ స్వాగత్, ఆర్ ఉదయ్ కుమార్, వందాన జాడే, బావురావ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని అశోక్ బుద్ధవిహార్లో బుద్ధ పౌర్ణమి సందర్భంగా భారతీయ బౌద్ధ మహాసభ తరఫున బుద్ధ జయంతి నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియన్ సభ్యులు, మాత రమాబాయి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బోథ్, మే 16 : బుద్ధుడు చూపిన మార్గం అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. బోథ్లోని అంబేద్కర్ విగ్రహం ఎదు ట బుద్ధ భగవానుడి 2566 జయంతిని సోమవారం నిర్వహించారు. బుద్ధుడి చిత్ర పటానికి పూజలు చేశారు. శాంతి, సౌభ్రాతృత్వం, సోదర భావం కోసం గౌతమ బుద్ధుడు చూపిన మా ర్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు.
అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు కంది ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి బత్తుల రమేశ్, అమృత్రావు, పసుల చంటి, చిట్టి సాగర్, కే మహేందర్, వీ రాజశేఖర్, పాలిక్ రమేశ్, సల్ల రవి, అనిల్, దయాకర్, రమేశ్ పాల్గొన్నారు. సొనాలలో బుద్ధుడి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. మహేశ్, ప్రేమ్రాజ్, రమేశ్, మల్లయ్య, సునీల్, రవి పాల్గొన్నారు.
గుడిహత్నూర్, మే 16 : గుడిహత్నూర్లోని జై భీంనగర్లో సోమవారం దమ్మ చక్ర ప్రవర్తన బుద్ధ విహార్లో తథగత్ భగవాన్ గౌతమ బుద్ధుడి జయంతిని ఘనంగా నిర్వహించారు. బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. మాజీ జడ్పీటీసీ మాధవ్ మస్కే, గోవింద్ బుద్దె, కిషన్ బుద్దె, మదన్ ససానే, వినోద్ జోందలే, చందాబాయి, సుజాత, మహిళలు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, మే 16 : మండలంలోని దళితుల ఆధ్వర్యంలో బుద్ధపౌర్ణమిని సోమవారం నిర్వహించారు. మండలకేంద్రంలోని ప్రబుద్ధనగర్, బుద్ధనగర్, మిలింద్నగర్, భీంనగర్లో బుద్ధుడి చిత్రపటంతోపాటు అంబేద్కర్ చిత్రపటాలకు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, దళితులు నివాళులర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు.
త్రీషరన్, పంచశీల్, బుద్ధవందన తీసుకున్నారు. ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, మాజీ సర్పంచ్ కోరెంగా సుంకట్రావ్, నాయకులు మనోహర్ కాంబ్లే, పోటే సాయినాథ్, శ్యామ్సుందర్, ఆరీఫ్బేగ్, పరత్వాగ్ విశాల్, బాబాసాహెబ్, శివాజీ, దళితానంద్, ఉత్తం, లహుదాస్, భరత్, శత్రుగన్జీవ్నే, రాజ్వర్ధన్, దిలీప్మోరే పాల్గొన్నారు.
నార్నూర్, మే 16 : ఉమ్మడి మండలంలోని నార్నూర్, దుప్పాపూర్, తాడిహత్నూర్, మలంగి, మారేగావ్, లోకారి(కే), దాబా(కే), మేడిగూడ, బుద్ధగూడ, మాన్కాపూర్, గుండాల ఎస్సీగూడతో పాటు దళితగూడేల్లో సోమవారం బుద్ధ పూర్ణిమను ఘనంగా నిర్వహించారు. గౌతమ బుద్ధుడి ప్రతిమలు, చిత్రపటానికి పూజలు చేశారు. బుద్ధవందనం ఆలపించారు. మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లొకండే చంద్రశేఖర్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, దుర్గే కేశవ్, సునీల్, రవి పాల్గొన్నారు.