నేరడిగొండ, డిసెంబర్ 27 : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నేరడిగొండ కేజీబీవీని మంగళవారం ఆమె పరిశీలించారు. ఇటీవల పాఠశాలలో ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న కలెక్టర్ పాఠశాలలోని స్టోర్ రూం, డైనింగ్హాల్, తరగతి గదులను పరిశీలించారు. స్టోర్రూంలోని ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వం డిన ఆహారాన్ని తిని చూశారు. తరగతి గది లో సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఘటన జరిగిన తీరుపై సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీపై కలెక్టర్ మండిపడ్డారు. ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల పరిస్థితిపై ఆరా తీశారు. వి ద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూ సుకోవాలని చెప్పారు. ఆమె వెంట సెక్టోరియల్ అధికారి ఉదయశ్రీ, తహసీల్దార్ పవన్చంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.