ఇంద్రవెల్లి, జనవరి17: అంధత్వాన్ని నిర్మూలించేందుకు చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అ న్నారు. ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం తనిఖీ చేశారు. శిబిరం వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కంటి వెలుగు కా ర్యక్రమాలపై ప్రజలకు పూర్తి అవగహన కల్పించాలని అ ధికారులకు సూచించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిం చి ప్రజల్లో విస్తృ తంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. శిబిరానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఎంపీడీవో పుష్పలత, వైద్యుడు శ్రీకాంత్, స్థానిక సర్పంచ్ గాంధారి, ఈవో సంజీవరావ్ పాల్గొన్నారు.
జిల్లాలో ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులందరూ సమన్వ యంతో విజయవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషా రఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమంపై మంగళవారం రెవెన్యూ, వైద్యా రోగ్య, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించా రు. 18 ఏండ్లు నిండిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వ హిస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిరోజు ఉద యం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. 32 బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటికే పరీక్షలు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గ్రామాలను కే టాయించామని పేర్కొన్నారు. గ్రామాల్లో కేంద్రాల వద్ద పూర్తి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్, తదితరులున్నారు.
రెండో విడుత కంటి వెలు గు కార్యక్రమానికి నిర్మల్ జిల్లాలో అధికారులు అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషారప్ అలీ ఫారూఖీతో పాటు అధికారులు కా ర్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ కల్పించారు. ప్రత్యేకంగా ప్రచార కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 32 బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతి బృందంలో ఒక ఆప్తాల్మిక్ అధికారి, ఒక మె డికల్ ఆఫీసర్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు సూపర్ వైజర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ముగ్గురు ఆశ కార్యకర్తలు, ఉంటారు. 32 మంది మెడికల్ ఆఫీసర్లు, 32 మంది పీ ఎంవోలు, 32 మంది డీఈవోలను నియమించారు. 19 మండలాల్లోని 23 పీహెచ్సీలలో కంటివెలుగు శిబిరాలు ప్రారంభం కానున్నాయి. కాగా, రెండో విడత కంటివెలుగు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని డీఎంహెచ్వో తెలిపారు. కంటి సమస్యలతో బా ధపడుతున్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించా రు. పరీక్షలకు వచ్చేవారు ఆధార్కార్డు తప్పనిసరిగా తీసు కురావాలన్నారు.