ఆదిలాబాద్ టౌన్, మే 11 : కఠోరంగా శ్రమి స్తేనే విజయం సాధ్యమవుతుందని, ఇందుకు విద్యార్థులు నిరంతరం కష్టపడాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ లోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా విద్యా శాఖ, మాధ్యమిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజర య్యారు. ఆయన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పడి ఆద్భుత విజయాలు సాధిం చారని ప్రశంసించారు. విద్యార్థుల జీవితంలో పదో తరగతి, ఇంటర్ కీలకమన్నారు. మార్కులు వస్తే సరిపోదని, జ్ఞానం సంపాదించాలన్నారు. అలాగే విషయ పరిజ్ఞానంపై దృష్టి సారించాల న్నారు. జీవితంలో ఎత్తు పల్లాలు అత్యంత సహజ మని, వీటిని చూసి ఎక్కడా నిరాశ పడవద్దన్నారు. అయితే విద్యార్థులు కృషి నిరంతరం చేస్తూనే ఉండాలని, ఈ కృషే విజయ తీరాలకు చేరుస్తుం దన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ట్రైనీ కలెక్టర్ శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే అత్యుత్తమ ఫలితాలు వచ్చాయని ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల ల్లో అత్యుత్తమ విద్యాబోధనతో సకల సౌకర్యా లను సర్కారు కల్పిస్తుండడంతో పిల్లలను చదివి స్తున్నామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. పాఠశా లలు మంచి ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని వారు తెలిపారు. ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని విద్యార్థులు గుర్తు చేసుకున్నారు.