ఎదులాపురం, అక్టోబర్ 21 : పోలీస్ అమరుల త్యాగాలకు సెల్యూట్ అని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్కార్వర్టర్స్లో నూతనంగా అమరవీరుల ముఖచిత్రాలతో ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జిల్లా అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్.శివారం ప్రసా ద్, ఎస్పీ ఉదయ్ కుమార్, డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జిల్లా ఉపరవాణా శాఖ అధికారి పుప్పాల శ్రీనివాస్, పోలీసు ఉన్నతాధికారు లు, అమరవీరుల కుటుంబసభ్యులతో కలిసి శనివారం నిర్వహించిన పోలీసు ఆమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సాయుధ పోలీసులు అమరవీరులకు సలామి చేస్తు గౌరవ వందనం సమర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధ్దాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అమరవీరుల కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలను ఉన్న వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఒకప్పటి మారుమూల గ్రామాలను సందర్శించడానికి ,ప్రభుత్వ పథకాలను అందించేందుకు, ఎన్నికల నిర్వహణ కష్టంగా ఉండే ఆ సమాజం నుంచి ప్రస్తుత అత్యంత భద్రమైన , ప్రశాంతమైన సమాజానికి ఎదగడానికి ముఖ్య కారణమన్నారు. అనంతరం జిల్లా అదనపు సెషన్స్ జడ్జి డాక్టర్ శివారం ప్రసాద్ మాట్లాడుతూ ఇంతటి ఘనకార్యాన్ని నిర్వహించిన జిల్లా పోలీ సు యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ.. అమరవీరులను నిత్యం స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు డీఎస్పీలు వీ ఉమేందర్, సీహెచ్ శ్రీనివాస్, సీహెచ్ నాగేందర్, పోతా రం శ్రీనివాస్, డీపీఆర్వో విష్ణు , సీఐలు కే.సత్యనారాయణ, కే.నరేశ్, ఏ.అశోక్, ప్రేమ్ కుమార్, ఐ సైదారావు, చంద్రశేఖర్, రామకృష్ణ, శ్రీనివాస్, ప్రణయ్ కుమార్, సురేశ్, ఎస్ఐలు, అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ సీసీ గిన్నెల సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు , సిబ్బంది ఉన్నారు.
ప్రజలు పోలీసు అధికారులతో కలిసి పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి చేపట్టిన ర్యాలీని కలెక్టర్, అదనపు న్యాయమూర్తి, ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్చౌరస్తా, తెలంగాణ చౌక్ వరకు సాగి తిరిగి పోలీస్ హెడ్క్వార్టర్కు చేరుకుంది.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 21 : పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ అశిష్ సాంగ్వన్ ముఖ్య అతిథిగా హాజరై అమర వీరుల కాగడాను వెలగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీసు కూడా అంతే కీలకమని కలెక్టర్ , ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. అ నంతరం అమవీరులను స్మరిస్తూ పుష్పాంజలి ఘ టించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించి పోలీసు కుటుంబాలకు బహుమతు లను అందించిన అనంతరం పట్టణంలోని ప్రధా న వీధుల గుండా ర్యాలీని నిర్వహించారు. కార్య క్రమంలో అదనపు ఎస్పీలు వీరన్న, వెంకటేశ్వర్లు, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, డీసీఆర్బీ డీయస్పీ రవీందర్ రెడ్డి, ఎస్బీ ఇనస్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పోలీసు కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ అం డగా నిలుస్తుందని ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నా రు. నిర్మల్ సాయుధ దళ కార్యాలయంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎండీ సలీం అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. ఈ విషయం తెలసుకున్న ఎస్పీ పట్టణంలోని గోల్డెన్ ఫంక్షన్ ప్రాంతంలోని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అంత్యక్రియల కోసం రూ.20 వేలు అందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ వీరన్న, వెంకటేశ్వర్లు, ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తదితరులు ఉన్నారు.