భైంసాటౌన్, సెప్టెంబర్ 13 : జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం తాలుకాస్థాయి అధికారులతో వజ్రోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 16న పట్టణంలో నిర్వహించే సమైక్యతా ర్యాలీలో 15 వేల మంది పాల్గొనేలా చూడాలని అధికారులకు సూచించారు. ర్యాలీకి వచ్చే ప్రజలు, విద్యార్థుల కోసం మైదానం, భోజనం ఏర్పాటు చేయాలన్నారు. 17న జాతీయ జెండా ఎగురవేయాలని, 18న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో ధన్రాజ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్, ముథోల్ సీఐ వినోద్, భైంసాటౌన్ సీఐ ప్రవీణ్, మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖలీం, భైంసా, కుభీర్ తహసీల్దార్లు చంద్రశేఖర్ రెడ్డి, విశ్వంభర్, భైంసా ఎంపీడీవో గంగాధర్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, ఎంఈవో సుభాష్, చంద్రకాంత్, హెచ్ఎంలు ముస్తాక్, రఘునాథ్ చారి, సుదీప్ తదితరులు పాల్గొన్నారు.
ముథోల్లో ఏర్పాట్ల పరిశీలన..
ముథోల్, సెప్టెంబర్ 13 : ముథోల్ మండల కేంద్రంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ముథోల్ జూనియర్ కళాశాలతో పాటు, తదితర ప్రాంతాలను సందర్శించారు. నియోజకవర్గంలో 15 వేల మంది విద్యార్థులతో ర్యాలీ తీసే ఏర్పాట్లను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈయన వెంట ఆర్డీవో లోకేశ్వర్ రావు, సీఐ వినోద్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎస్ఐ తిరుపతి తదితరులున్నారు.
ఖానాపూర్లో హేమంత్ బోర్కడే..
ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 13 : ఖానాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏడు మండలాల సం బంధిత అధికారులతో నిర్మల్ అదనపు కలెక్టర్ హే మంత్ బోర్కడే జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలపై సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా మీదుగా మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ యార్డు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలని సూచించారు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, మహిళా సంఘాలు వాడవాడనా భక్తిభావం చాటేలా పాల్గొనేలా చూ డాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం వేడుకల నిర్వహణకు మున్సిపల్ చైర్మన్ రాజేందర్తో కలిసి పట్టణంలోని జేకేనగర్, సాయిబాబా ఆలయం పక్కన, వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో ఆర్డీవో తుకారాం, సీఐ అజయ్బాబు, ఎస్ఐ రజినీకాంత్, తహసీల్దార్ రాజామోహన్, మున్సిపల్ కమిషనర్ రత్నాకర్రావు, ఏవో ఆసం రవి, ఏడు మండలాల తహసీల్దార్లు, ఎస్ఐలు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.