ఆదిలాబాద్ రూరల్, మే 11: కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శైలజ సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత హౌసింగ్బోర్డులో చేపట్టిన ఇంటింటా ఆరోగ్య సర్వేను మంగళవారం ఆమె పరిశీలించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే సంబంధిత మందులు ఇస్తామని పేర్కొన్నారు. ఒకవేళ తగ్గకపోతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వారికి ఇంటివద్దనే చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అశోక్, మెప్మా డీపీఎం భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
ఇచ్చోడ, మే 11: ప్రజా సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా ఆరోగ్య సర్వే చేపట్టిందని ఇచ్చోడ ప్రభుత్వ వైద్యాధికారి ఆకుదారి సాగర్ అన్నారు. మండలంలోని ఇస్లాంనగర్ గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న బాధితుల వివరాలు నమోదు చేసుకొని మెడికల్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ అమీనాబీ, ఉపసర్పంచ్ చౌహాన్ రాందాస్, ఏఎన్ఎం తులసి సిబ్బంది పాల్గొన్నారు.
బేల, మే 11: కొవిడ్ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ఇంద్రశేఖర్ కోరారు. మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ఇంటింటా సర్వే చేశారు. ఇంటింటికీ తిరుగుతూ కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు, సందేహాలు ఉన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 9440402226కు ఫోన్ చేయాలని సూచించారు. అలాగే పలు గ్రామాల్లో ఇంటింటా సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్లు రాకేశ్, తేజ్రావు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే. , ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.