బేల, ఏప్రిల్ 5: రెండో దశ కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు లేకుండా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సాయన్న అన్నారు. మండలంలోని డోప్టాల, సాంగిడి గ్రామాల్లో సోమవారం బ్యానర్లు ప్రదర్శిస్తూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డోప్టాల సర్పంచ్ రాకేశ్, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఏప్రిల్ 5: మండలంలోని తాడిహత్నూర్ గ్రామంలో ఎస్ఐ విజయ్కుమార్ గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐలు ధన్శ్రీ, ప్రవళిక, ఉపసర్పంచ్ ఫడ్ విష్ణు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
నార్నూర్, ఏప్రిల్ 5: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిబంధనలు పాటించాలని గాదిగూడ ఎస్ఐ సయ్యద్ ముజాహిద్ కోరారు. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో గుంపుగా ఉండవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, ఏప్రిల్ 5: మండల కేంద్రంలోని ఎన్టీఆర్చౌక్లో ఎస్ఐ సుబ్బారావు వాహనదారులకు, ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. మాస్కు లేకుండా బయట తిరిగితే జరిమానా విధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
సమాజ సేవ చేయాలి
ఉట్నూర్, ఏప్రిల్ 5: సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఉట్నూర్ సీఐ నరేశ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జగ్జీవన్రామ్చౌక్లో వినయ్ జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జూవెలర్స్ యజమాని సంతోష్, నాయకులు పాల్గొన్నారు.
మాస్కుల పంపిణీ
అంగడిబజార్లో ఉపాధ్యాయ టీటీఎఫ్ ఆధర్వంలో ఉట్నూర్ సీఐ నరేశ్కుమార్ ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు గణేశ్, పవన్లాల్ పాల్గొన్నారు.