ఆసిఫాబాద్ టౌన్,మార్చి 21:మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖాధికారి భాసర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్తో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఏపీఎంలు, సీడీపీవోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల హాజరు శాతాన్ని పెంచాలని, దినసరి వేతనం పెంపొందించేందుకు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ వాటిక నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ యూనిట్లను ఏర్పాటు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక్కడ అధికారులు ఉన్నారు.