ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(MLC Deshapati Srinivas) అన్నారు. ఏ పార్టీ్కైనా కార్యకర్తలే బలమని, బీఆర్ఎస్(BRS) కు మాత్రం కథానాయకులని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బోథ్ మండలంలోని పరిచయ గార్డెన్ లో శనివారం జరిగింది.
ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సమష్టిగా పనిచేసి గెలిపించాలని కోరారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పార్లమెంట్ ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి బీఅర్ఎస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు.
ఈ సమావేశానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ దండే విఠల్, పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న , మాజీ శాసనసభ్యులు అత్రం సక్కు , మాజీ పార్లమెంట్ సభ్యులు గొడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.