భైంసా, ఫిబ్రవరి 26 : ఆధార్ ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన ధ్రువీకరణ పత్రం. ఈ నేపథ్యంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆధార్ కార్డు అందించేలా రాష్ట్ర ప్ర భుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా దవాఖానలోనే వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డు అందిస్తున్నారు. భారత పౌ రులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. చిన్న పిల్లల విషయంలో ఆధార్ ఎన్రోల్మెంట్పై చాలా మంది తల్లిదండ్రులు అలసత్వం వహిస్తున్నా రు. బడికి వెళ్లే వయస్సు వచ్చే దాకా ఆధార్ కార్డు అవసరం లేకపోవడంతో పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు వివరాలు నమోదు చే సుకోవడం లేదు. మరికొందరికి అవగాహన లేకపోవడంతో పిల్లలకు ఆధార్ కార్డులు తీసుకోవడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే చైల్డ్ ఎన్రోల్మెంట్ ైక్లెంట్ విధానాన్ని ప్రవేశ పె ట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తు న్న సంక్షేమ పథకాల కారణంగా ప్రభుత్వ ద వాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. అక్కడే పుట్టిన శిశువులకు ఆధార్ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని ఏరియా దవాఖానల్లో శిశువుల వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
మాతా శిశు సంరక్షణలో భాగంగా రాష్ట్రప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు కేసీఆర్ కిట్ను అమలు చేస్తున్నది. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో అప్పుడే పుట్టిన శిశువుల ఆధార్ వివరాలను సైతం సేకరిస్తున్నారు. బయోమెట్రిక్, ట్యాబ్ తదితర పరికరాలను సమకూర్చి ఆధార్ నమోదు ప్రక్రియను డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అందించారు. శిశువు ఫొటోతో పాటు తల్లిదండ్రుల బయోమెట్రిక్ వివరాలు నమోదు చేయగానే ఎన్రోల్మెంట్ నంబరు వస్తుంది. దీనిద్వారా ఎక్కడైనా ఆధార్కార్డు తీసుకునే అవకాశం ఉంది. తల్లి పేరుతో పాటు శిశువు అనే పేరు నమోదవుతుంది. శిశువుకు పేరు పెట్టిన తర్వాత వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ప్రభుత్వ ఏరియా దవాఖానల్లో పుట్టిన శిశువులకు ఆధార్ కార్డు కోసం వారి వివరాలు నమోదు చేస్తున్నాం. ఆధార్ ఎన్రోల్మెంట్పై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణనిచ్చాం. ఈ విషయమై తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ కాశీనాథ్,ఏరియా దవాఖాన సూపరింటెండెంట్