ముథోల్, నవంబర్ 26 : ముందు వెళ్తున్న బస్సును ద్విచక్ర వాహనంతో ఓవర్టేక్ చేయబోయిన ఓ యువకుడు.. ఎదురుగా వస్తున్న పాల వ్యాన్ను బలం గా ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాల పాలవగా.. స్థానికులు దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. ఈ ఘటన ముథోల్లోని సబ్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. ఎస్ఐ తిరుపతి తెలిపిన వివరాల మేర కు.. ముథోల్కు చెందిన షాబాజ్ ఖాన్ (21) ప్లంబర్గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో తన స్వగ్రామం తరోడ నుంచి ముథోల్కు ఉదయం బైక్ వస్తున్నాడు. ఈ క్రమంలో బస్సును ఓవర్టెక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న పాల ట్యాంకర్ను అతి వేగంగా ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలపాలై రోడ్డుపై పడిపో యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన భైంసా దవా ఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. కాగా, ప్రమా దం జరిగిన చోటుకు 108 సమయానికి రాకపోవడంతో స్థాని కులు ఆందోళనకు దిగారు. సంఘటనా స్థలానికి సరైన సమ యంలో అంబులెన్స్ వస్తే షాబాజ్ ఖాన్ ప్రాణాలతో బయ టపడేవాడని వాపోయారు. దీంతో సీఐ, ఎస్ఐ ఆం దోళనకారులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది.