ఉట్నూర్, ఏప్రిల్ 6 : హనుమాన్ జయంతి సందర్భంగా ఉట్నూర్లో గురువారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో పుణె బ్యాండ్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొదట వినాయక్ చౌక్లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. మధ్యాహ్నం వరకు సాగిన ఈ ర్యాలీలో స్థానిక వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి పాల్గొన్నారు.
పలువురు వ్యాపారులు, భక్తులకు అంబలి, వాటర్ ప్యాకెట్లు అందించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, నాయకులు వెడ్మ బొజ్జు పాల్గొని భక్తులకు ఉత్సాహపరిచారు. పెద్ద ఎత్తున పాల్గొన్న యువత నృత్యాలతో హోరెత్తించారు. ఉట్నూర్ సీఐ సైదారావు, ఎస్ఐలు భరత్ సుమన్, మహేశ్ భారీగా బందోబస్త్ ఏర్పాటు చేశారు.