మంచిర్యాల అర్బన్, మార్చి 4 : జిల్లాలోని 25 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా సాగింది. సోమవారం 93.15 శాతం విద్యార్థులు పరీక్ష రాశారు. 7,415(జనరల్ 6,241, వొకేషనల్ 1,174) మంది విద్యార్థులకుగాను 6,907(జనరల్ 5,831, వొకేషనల్ 1,076) మంది పరీక్షలు రాయగా, 508 (జనరల్ 410, వొకేషనల్ 98) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.