పెంబి, జనవరి 3 : పెంబి మండలం యాపల్గూడ అటవీ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఘటనలో ఏడుగురు నిందితులను ఆరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్వో రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాపల్గూడ పంచాయతీ పరిధిలోని నాయికపుగూడకు చెందిన వేటగాళ్లు యాపల్గూడ పడమర బీట్ సమీపంలోని ఆర్వోఎఫ్ఆర్ పంట పొలం వద్ద విద్యుత్ తీగలు అమర్చారు. ఆదివారం ఉదయం తెల్లవారుజామున నీలిగాయి హతమైంది. దాని మాంసాన్ని గ్రామంలోకి తరలిస్తుండగా, ఎఫ్ఎస్వో కింగ్ఫిషర్కు సమాచారం అందింది.
ఈ మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఘటనా స్థలంలో వదిలేసిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, విచారణ చేపట్టారు. అనంతరం ఏడుగురి అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ వారిని బుధవారం న్యాయస్థానం ఎదుట హజరుపర్చనున్నట్లు ఎఫ్ఆర్వో తెలిపారు. అటవీ జంతువులను వేటాడినా, పంట పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు అమర్చినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ప్రతాప్, ఎఫ్ఎస్వో ఆమీర్అలీ, ఎఫ్బీవో ఉదయ్, శివ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.