దిలావర్పూర్, మార్చి 7 : ఒకప్పుడు చినుకుపడితే గ్రామాలు చిత్తడిగా మారేవి. తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుతో గ్రామీణ రోడ్లకు మహర్దశ వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రగతి పేరుతో గ్రామాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్న ది. ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో మట్టి రోడ్లను సీసీగా మారుస్తున్నది. దీంతో గ్రామాల్లోని ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. నిర్మల్ జిల్లాకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరానికి 668 పనులు మంజూరయ్యా యి. ఇందుకోసం రూ.49.07 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నెల 31 వరకు పనుల పూర్తికి చర్యలు చేపట్టింది.
నిధుల మంజూరు ఇలా..
నిర్మల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి 668 పనులకు రూ.49కోట్ల 07లక్షలు మంజూరయ్యాయి. ఇందులో నిర్మల్ ని యోజకవర్గంలోని ఏడు మండలాలకు రూ.19.01 కోట్లు, ముథోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు రూ.13.96 కోట్లు, ఖానాపూర్ నియోజకవర్గంలోని నాలుగు మం డలాలకు రూ.14.10కోట్ల చొప్పున నిధులు విడుదలయ్యాయి. అత్యధికంగా నిర్మల్ నియో జకవర్గంలో రూ.19 కోట్లకు పైబడిన నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.
బురద కష్టాలకు చెక్..
ఒకప్పుడు గ్రామాల్లో వర్షం పడినప్పుడు మట్టి రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చినుకు పడితే చిత్తడిగా మారి కాలినడక సైతం ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. ఇందుకోసం అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తున్నది. ప్రస్తుతం ఆయా గ్రామాల్లో మట్టి రోడ్లన్నీ సీసీగా మారిపోతున్నాయి.
శరవేగంగా పనులు..
గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు మంజూరు కావడంతో సర్పంచులు, ప్రజాప్రతినిధులు పనులను శరవేగంగా, నాణ్యతా ప్రమాణాలతో చేపడుతున్నారు. పనులు సాగుతున్న గ్రామాలకు ఆ మండలస్థాయి అధికారులైన పంచాయతీ రాజ్ ఇంజినీర్లు వెళ్తూ పర్యవేక్షిస్తున్నారు. దీంతో పాటు అభివృద్ధి పనులు పర్యవేక్షించే మండల పరిషత్ అభివృద్ధి అధికారులైన ఎంపీవోలు, డివిజనల్ డీఈలు సైతం పనులు పర్యవేక్షించి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.
ఈ నెల 31లోగా పనుల పూర్తికి చర్యలు
నిర్మల్ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన నిధులతో ఈ నెల 31 వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. చాలా చోట్ల ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పనులు చకచకా చేపడుతున్నారు. పనులు పూర్తి చేసిన పంచాయతీలకు ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులు వాటి వివరాలను సేకరించారు. చేసిన పనులకు బిల్లు చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నారు.
మా ఊళ్లో మట్టిరోడ్డే లేదు
మా ఊరులో నాలుగు సంవత్సరాల నుంచి విడుతల వారీగా సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. దీంతో ఆయా కాలనీల్లో అన్నీ సీసీరోడ్లే కనిపిస్తున్నాయి. ఒక్క కాలనీలో మట్టి రోడ్డుంటే ఈ సంవత్సరం మా సర్పంచ్ సీసీ రోడ్డు వేయించాడు. దీంతో ఊరంతా ఎక్కడ తిరిగినా మట్టి రోడ్డు కనిపిస్తలేదు.
– మధు
ఈ వారంలో మరిన్ని నిధులు
నిర్మల్ జిల్లాకు ఈ వారంలో మరిన్ని నిధులు మంజూరు కానున్నాయి. ఇప్పటి వరకు మంజూరైన నిధులతో సంబంధిత సర్పంచులు, ప్రజాప్రతినిధులు పనులు చేపడుతున్నారు. ఈ పనులు జరుగుతున్న గ్రామాలను మా శాఖ ఇంజినీర్ పర్యవేక్షిస్తున్నారు. నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 31 వరకు పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం.
– శంకరయ్య, పీఆర్ ఈఈ, నిర్మల్