ఎదులాపురం,డిసెంబర్12:పోలీస్ రిక్రూట్ మెంట్లో భాగంగా నిర్వహించిన దేహధారుడ్య పరీక్షల్లో మహిళా అభ్యర్థులే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లా మహిళా అభ్యర్థులకు శని, సోమవారాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన ఫిజికల్ టెస్ట్లు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. మంగళవారం నుంచి 19వరకు పురుష అభ్యర్థులకు దేహధారుడ్య పరీక్షలు కొనసాగుతాయని చెప్పారు. 923 మహిళా అభ్యర్థులకు గాను 812 మంది హాజరయ్యారని తెలి పారు. రాత పరీక్షకు 516 మంది అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది అర్హత సాధించారన్నారు. 296 మంది అభ్యర్థులు డిస్క్వాలిఫై అయినట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్జాన్రావు, ఏఆర్ అదనపు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, డీఎస్పీలు వీ ఉమేందర్, వీ వెంకటేశ్వర్ రావు, ఎస్ ఉపేందర్, ఉమామహేశ్వరరావు, సీఐలు, మహిళా ఎస్ఐలు, ఐటి కోర్, ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్ కమ్యూనికేషన్, స్పెషల్పార్టీ, క్యూఆర్టీ, ఉమ్మడి జిల్లా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.