బజార్హత్నూర్, డిసెంబర్ 29 : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, మాజీ ఎంపీ జీ నగేశ్ అన్నారు. కాండ్లీ గ్రామంలోని జగదాంబాదేవి విగ్రహ ప్రతిష్ఠాపనకు బుధవారం వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తిమార్గంలో నడువాలని సూచించారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీకి గ్రామస్తులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో పలు జంటలు గాయత్రీ యజ్ఞంలో పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్రావు, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, నేరడిగొండ ఎంపీపీ సజన్రాథోడ్, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు రాథోడ్ శ్రీరాం, ఇందల్సింగ్, రాజు, సుభాష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే..
బోథ్, డిసెంబర్ 29 : ఆదిలాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీ ఉదయ్కుమార్రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదిలాబాద్లోని పోలీసు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై చర్చించారు.