జన్నారం, ఫిబ్రవరి 19 : కవ్వాల్ టైగర్ రిజర్డ్ ఫారెస్ట్లో నిర్వహించిన రెండో విడుత బర్డ్ వాక్ ఫెస్టివల్ అదివారం ముగిసింది.జన్నారం ఫారెస్ట్ రేంజ్లోని గోండుగూడ, బైసన్కుంట ప్రాంతాల్లో సెలయేర్ల వద్ద పక్షులు కిలకిల రావాలతో సందడి చేశాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాల్లోని వివిధ జిల్లాలకు చెందిన 74 మంది పర్యాటకులు పాల్గొన్నారు. మొదటిరోజు ఇందన్పెల్లి రేంజ్లో పర్యటించి గోండుగూడ వాచ్టవర్ వద్ద రాత్రి బసచేశారు. ఆదివారం బైసన్ కుంటవద్ద పక్షులను కెమెరాల్లో బంధించారు. వందకు పైగా వివిధ రకాల పక్షులను గుర్తించినట్లు ఎఫ్డీవో మాధవరావు తెలిపారు. ఫెస్టివల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను అందజేశారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి, ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జన్నారం, తాళ్లపేట్ రేంజ్ అధికారులు హఫీసొదీన్, రత్నాకర్రావు, ఎఫ్బీవోలు శ్రీను, సతీశ్, శ్రీరామ్, సిబ్బంది పాల్గొన్నారు.