ఎదులాపురం, నవంబర్ 28: బడుగుల బాంధవుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో పలు సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జ్యోతిబా ఫూలే 131వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఫూలే కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈర్ల సత్యనారాయణ, పార్థసారథి, ఉపాధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ అశోక్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్, అన్నదానం జగదీశ్, నవీన్యాదవ్, బండారి కృష్ణ, అజయ్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, మహేందర్నాథ్ యాదవ్, విజయ్ పాల్గొన్నారు.
స్వేరోస్ ఆధ్యర్యంలో..
బీసీ సంక్షేమ సంఘ భవనంలో స్వేరోస్ నాయకులు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వేరోస్ రాష్ట్ర కార్యదర్శి పెంటపర్తి ఊశన్న, రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉదారి నారాయణ, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు అనిల్, స్వేరోస్ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లా ఇన్చార్జి సోంకాంబ్లే, వికాస్, నాయకులు చైతన్య కుమార్, విజయ్, మహేందర్, రమేశ్ మిలింద్కాంబ్లే పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 28 : జిల్లా కేంద్రంలో మాలీ మహా సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా ఫూలే వర్ధంతి నిర్వహించారు. అలాగే బీసీ స్టడీ సర్కిల్ ఆవరణలో ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పెట్కులే, నాయకులు సాంబన్న, విజయ్, సుభాష్, కల్పన, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లిలో…
ఇంద్రవెల్లి, నవంబర్ 28: మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో దళిత సంఘాల నాయకులు జ్యోతిబా ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఎస్పీ మండలాధ్యక్షుడు మీర్జా ఆరిఫ్బేగ్, స్వేరోస్ జిల్లా ఉపాధ్యక్షుడు దళితానంద్, బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శివాజీ, నాయకుడు వాగ్మారే జీవన్ పాల్గొన్నారు.
సొనాలలో..
బోథ్, నవంబర్ 28: సొనాలలో నవయువ మహాజన యూత్ సభ్యులు మహాత్మా జ్యోతిబాఫూలే చిత్రపటం వద్ద పూజలు చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు మంగలపెల్లి రాజశేఖర్, ప్రవీణ్, ప్రశాంత్, ఉదయ్, లక్ష్మణ్, క్రాంతి, శ్రీకాంత్, చిన్నయ్య, అరుణ్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
కుచులాపూర్లో..
తలమడుగు, నవంబర్ 28: కుచులాపూర్ గ్రామంలో మాలీ సంఘం నాయకులు మహాత్మా జ్యోతిబా ఫూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మోహిత ప్రభ, ఎంపీపీ లక్ష్మి, ఉప సర్పంచ్ కిషన్, గ్రామ పటేల్ రాములు, వామన్, సుధాకర్, మాలీ సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాంసి మండలంలో..
తాంసి, నవంబర్ 28: తాంసి, గిరిగాం, కప్పర్లలో మాలీ కులస్తులు మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు కృష్ణ, గజానన్, సదానందం, పీఏసీఎస్ వైస్చైర్మన్ ధనుంజయ్, తాంసి మాజీ ఎంపీటీసీ గంగారాం, నాయకులు గంగారాం, విలాస్, ఉత్తమ్, ఆశన్న, నరేందర్, రాఘవేంద్ర పాల్గొన్నారు.