నిర్మల్ టౌన్, అక్టోబర్ 28 : తెలంగాణ ప్రభు త్వం గిరిజన రైతులకు తీపి కబురు అందించింది. పోడు భూముల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఏళ్ల తరబడి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. ఇంతకుముందు పోడు భూములకు పట్టాలివ్వాలని అధికారు లు, ప్రజాప్రతినిధుల ముందు తమ గోడును వెల్లబోసుకుంటున్నప్పకిటికీ పరిష్కారం కాలే దు. దీంతో గిరిజన రైతులు సంక్షేమ పథకాల కు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్లకుపైగా పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన వారికి పట్టాలిచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లను చైర్మన్గా, డివిజన్ స్థాయిలో ఆర్డీవోలను ఎంపిక చేసి అటవీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో సమస్యలను పరిష్కరించేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. వచ్చే నెల 8 నుంచి దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో విచారణ చేసి హక్కు పత్రాలను అందిస్తామని సీఎం ప్రకటించడంతో ఆదివాసీ బిడ్డలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా లో ఇప్పటివరకు 57,831 దరఖాస్తులు రాగా.. అందులో 37,809 దరఖాస్తులను ఆమోదించారు. అందుంలో 37121 దరఖాస్తులను పరిష్కరించగా, ఇంకా 688 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు సుమారు 4,03,966 ఎకరాల భూమిని పంపిణీ చేయగా.. మరో 2,3499 ఎకరాల భూమిని పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. జిల్లాలో 5లక్షల ఎకరాలకు పైగా పోడు భూములను సాగు చేస్తూ గిరిజన రైతులు జీనవోపాధి పొందుతున్నారు. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఆర్వోఎఫ్ఆర్ కింద భూమి హక్కు పత్రాలను అందించాలని నిర్ణయించినప్పటికీ ఆశించినస్థాయిలో ముందుకు సాగలేదు. దాదాపు 16 ఏళ్లుగా గిరిజన బిడ్డలు భూమి హక్కు పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోగా.. ప్రభుత్వమే క్షేత్రస్థాయిలోకి వచ్చి భూముల వివరాలను గుర్తించి అర్హులైన రైతులకు పట్టాలిస్తామని చెప్పడంతో ఉమ్మడి జిల్లాలో అనేక మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది