ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్
వైభవంగా విగ్రహాల ప్రతిష్ఠాపన
భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిట
నార్నూర్, డిసెంబర్ 27 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. సోమవారం చోర్గావ్ గ్రామంలోని రామ్మూర్తి ఆలయంలో కలశ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో వేదపండితులు మహా యజ్ఞం నిర్వహించారు. జడ్పీ చైర్మన్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఆలయంలో కలశ, శివలింగం, నాగదేవత, నంది, గణపతి, హను మంతుడితోపాటు నవగ్రహ విగ్రహాలు వేద మం త్రాల మధ్య ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీరామ్ మహరాజ్, రాంసింగ్ మహరాజ్, ద్రైవ్సింగ్ మహరాజ్, దశరథ్ మహ రాజ్, కిషన్ మహరాజ్ మాట్లాడుతూ వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. అందరూ ఆధ్యాత్మిక సేవా భావా న్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం అన్నదా నం నిర్వహించారు. ఎంపీపీ కనక మోతుబాయి, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, సర్పంచ్ ఆత్రం అనసుయా, లంబడా సంఘం జిల్లా అధ్యక్షుడు కైలాశ్సింగ్, గ్రామ పెద్దలు ఉన్నారు.