ముథోల్, డిసెంబర్ 27 : ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే జీ విఠల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ముథోల్ మండలం తరోడాలో రూ. 2.50 లక్షలు సీడీపీ నిధులతో చేపట్టనున్న షాదీఖానా ప్రహరీ, రూ. 2.60 లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ ప్రహరీ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి విశేషంగా పాటుపడు తుందని పేర్కొన్నారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథ కాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందు గా వెళ్తానని వివరించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్, టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర్, మాజీ సర్పంచ్ ఆరీఫ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.