ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి
మండల సమావేశానికి హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు
తిర్యాణి,ఆగస్టు 27: అధికారులు అలసత్వాన్ని వీడి అభివృద్ధి పనులకు సహకరించాలని ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆమె అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వనజ హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, గ్రామీణ తాగునీటి శాఖల ఏఈలు నివేదిక చదువుతుండగా, పలువురు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు అందండ లేదన్నారు . దీంతో ఏఈ కృష్ణతేజ మాట్లాడుతూ మండలంలో 138 ఆవాస ప్రాంతాలు ఉండగా, 96 ప్రాంతాలకు నీళ్లు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఐసీడీఎస్ సీడీపీవో కమల, వి ద్యుత్ శాఖ ఇన్చార్జి ఏఈ ప్రణిత తమ నివేదికలు చదువుతుండగా కౌఠగాం సర్పంచ్ కోట్నాక గణపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యార్థులకు సక్రమంగా పోషకాహారం అందించడం లేదని, గ్రామంలో ఇప్పటివరకు 14 కట్టెల స్తంభాలు ఉన్నాయని, విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయని అయినప్పటికీ పట్టించుకోవడం లేదని సభ దృష్టికి తెచ్చారు.
వెంటనే వారు స్పం దించి పోషకాహరం అందేలా చూస్తామని, కరంట్ సమస్యలు పరిష్కరిస్తామని వారు చె ప్పారు. ఆర్అండ్బీ, పంచాయతీ రా జ్ అధికారులు తమ నివేదిక చదివి వినిపిస్తుండగా కొన్ని గ్రా మాలకు రోడ్లు మంజూరైనప్పటికీ అటవీశాఖ అనుమతులు లేవనే కారణంగా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ జోక్యం చేసుకుని గంభీరావుపేట్ ఆర్ఎఫ్ కెనాల్కు గండి పడిందని ఫి ర్యాదు చేసినప్పటికీ అధికారులు చూసిపోతున్నారే తప్పా మరమ్మతులు చేపట్టడం లేదని , దీంతో ఆయకట్టు రైతులకు సాగు నీరు అందడం లేదని సభ దృష్టికి తెచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ మర్సుకోల శ్రీ దేవి, జడ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ సూచించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.