సందడిగా మారిన చర్చిలు
ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు
బోథ్, డిసెంబర్ 25: ఏస్తుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బోథ్, పొచ్చెర, కౌఠ(బీ) చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అర్ధరాత్రి సమయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. చర్చిల వద్ద ఏసు ప్రభువు, ఏసు బాలుని జననం వంటి వాటితో ప్రత్యేక సెట్టింగులు ఏర్పాటు చేశారు. ప్రార్థనల అనంతరం పాస్టర్లు బైబిల్ సందేశం చదివి వినిపించారు.
ఇచ్చోడలో..
ఇచ్చోడ, డిసెంబర్ 25: మండల కేంద్రంలోని ఐదు చర్చిల్లో పాస్టర్లు కరుణాకర్, పీటర్ నాయక్, ప్రసాద్, నేయేమియా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నారులతో కేక్ కట్ చేయించారు. క్రీస్తు తాత వేషధారాణతో చిన్నారులు అలరించారు. చర్చిలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. క్రిస్మస్ వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
గుడిహత్నూర్లో..
గుడిహత్నూర్, డిసెంబర్ 25 : గుడిహత్నూర్, మన్నూర్, ముత్నూర్, లింగాపూర్, గురుజ, డోంగర్గామ్ గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బ్రహ్మానంద్, మాజీఎంపీపీ సత్యరాజ్, ఎంపీటీసీ న్యాను, నాయకులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ, డిసెంబర్ 25 : మండల కేంద్రంతో పాటు పొన్న గ్రామంలో పాస్టర్లు నరేశ్ జెకర్యా, సందానంద్ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
తాంసి మండలంలో..
తాంసి, డిసెంబర్ 25: తాంసి, కప్పర్లలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతకుముందు ప్రభుత్వం అందజేసిన క్రిస్మస్ కానుకులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు సదానందం, కృష్ణ, ఎంపీటీసీలు సంతోష్, మాజీ జడ్పీటీసీ నారాయణ, మాజీ సర్పంచ్ నారాయణ పాల్గొన్నారు.
బేల, డిసెంబర్ 25: మండల కేంద్రంలోని కలవరి ప్రేమ మందిరంతో పాటు చప్రాల గ్రామంలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, సర్పంచ్ ఇంద్రశేఖర్, పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్ రెడ్డి, సతీశ్ పవార్, తేజ్రావు, దేవన్న, తన్వీర్ఖాన్ పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ , డిసెంబర్ 25 : కరుణామయుడు ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని చర్చిల్లో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. శుక్రవారం రాత్రి నుంచే చర్చిల్లో పండుగ వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చిల్లో ఏసుజననంపై పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉదయం నుంచే చర్చిలకు క్రైస్తవులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు శుభాకాంక్షలు తెలిపారు.
నేరడిగొండ, డిసెంబర్ 25 : మండల కేంద్రంలోని మోరియా, హార్వెస్ట్ చర్చిల్లో క్రిస్మస్ ట్రీ, క్రీస్తు జననం కళాఖండాలను ప్రదర్శించారు. పాస్టర్లు డేవిడ్పాల్, క్రాంతికుమార్ కేక్ కట్ చేసి పిల్లలకు మిఠాయిలు పంచారు.