ప్రాణాపాయస్థితిలో 10 రోజుల చిన్నారి
న్యుమోనియా, ఊపిరితిత్తుల వ్యాధితో దవాఖానలో..
వెంటిలేటర్పై చికిత్స
సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు
బోథ్ ;మండలం సాకెర గ్రామానికి చెందిన కుందూరి నరేశ్-ప్రవళిక దంపతులు కూలినాలి చేస్తేగానీ రోజు గడవని పరిస్థితి. వీరికి మొదటి సంతానంగా ఓ పాప(2) జన్మించింది. రెండో సంతానంగా పది రోజుల క్రితం బాబు పుట్టాడు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిర్మల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో ప్రవళిక డెలివరీ కాగా.. అప్పుడు ఇద్దరూ క్షేమంగానే ఉన్నా ఒకరోజు తర్వాత బాబు ఆరోగ్య పరిస్థితి దిగజారింది. దీంతో వైద్యుల సూచన మేరకు మరుసటి రోజు స్థానికంగానే ఓ ప్రైవేట్ చిన్న పిల్లల దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడ రెండు రోజులు చికిత్స అందించినా బాబు పరిస్థితిలో మార్పురాకపోవడంతో నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ క్రిటికల్ కేర్ వైద్యశాలకు తరలించారు. పుట్టిన నాటి నుంచే న్యుమోనియా, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతుండగా.. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. వైద్యానికి రూ 2 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో కూలీ పనులకు వెళ్తేగానీ పొట్టగడవని నరేశ్ కుటుంబం బాబు చికిత్సకు డబ్బులు కట్టే స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నది. దాతలు ఎవరైనా ముందుకొచ్చి బాబు వైద్యం కోసం సాయం అందించాలని వేడుకుంటున్నది. దాతలు కుందూరి నరేశ్, ఫోన్ పే నంబర్ 80088 20784, అకౌంట్ నంబర్ 62443959416, ఐఎఫ్ఎస్సీ కోడ్ 0020129, ఖానాపూర్ బ్రాంచ్ లో చేతనైనంత సాయం అందించాలని కు టుంబ సభ్యులు వేడుకుంటున్నారు. బాబు ను బతికించాలని కోరుతున్నారు.
కూలినాలి చేసుకునే ఆ దంపతులు కొడుకు పుట్టాడని ఎంతో సంతోషపడ్డారు.. ఆ ఆనందంలో ఉండగానే.. రెండో రోజు నుంచి బాబు ఊపిరి తిత్తుల వ్యాధి (దడ)తో బాధపడుతున్నాడు. వెంటనే నిర్మల్లోని ఓ ప్రైవేట్ చిన్నపిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించి న్యుమోనియా, ఊపిరితిత్తుల వ్యాధి ఉందని చెప్పారు. రెండు రోజులు చికిత్స అందించినా నయం కాకపోవడంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించాలని సూచించారు. వారి సూచన మేరకు నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా.. అక్కడ వివిధ పరీక్షలు చేసిన డాక్టర్లు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఏమీ పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లిదండ్రులు.. మా కొడుకుకు ప్రాణం పోయుండ్రని దాతలను వేడుకుంటున్నారు.