శ్రీరాంపూర్, జూలై 24: సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకోవడంతో శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సంబురాలు చేసుకున్నారు. శ్రీరాంపూర్ ఆర్కే 6గనిపై టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు డీకొండ అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్మికులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ఓసీపీ వెంకటేశ్వర్లు, నాయకులు బ్రహ్మచారి, శ్రీనివాసచారి, మోహన్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో
తాండూర్, జూలై 24 : రెండో విడుత గొర్రెలు, మేకలు యూనిట్ల పంపిణీకి రూ. 6వేల కోట్లు మంజూరుకు సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంపై గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మండలంలోని రేచినిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సొసైటీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియజేశారు. సొసైటీ నియోజకవర్గ అధ్యక్షుడు ఎగ్గె కొమురయ్య, మండల అధ్యక్షుడు అన్నం మల్లేశ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తాండూర్ సీఐ కోట బాబురావు, సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ము అశోక్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు చేగొండ రాజన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ముదిగిరి కొమురయ్య, సర్పంచ్ చింతపురి దుర్గుబాయి, టీఆర్ఎస్ నాయకులు సుబ్బ దత్తుమూర్తి, ఉప సర్పంచ్ నరిగ రాజయ్య, కులపెద్దలు పాల్గొన్నారు.