ప్రారంభించిన సంస్థ డైరెక్టర్లు
గాలిలోని ఆక్సిజన్ గ్రహించి ఉత్పత్తి
గోదావరిఖని, అక్టోబర్ 23 : సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని ఏరియా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. దీనిని సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణ, టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావు శనివారం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. డైరెక్ట ర్లు మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో సంస్థ సీఎండీ సింగరేణి వ్యాప్తంగా అనేక కరోనా కట్టడి చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రామగుండం ఏరియా దవాఖానలో నూతనంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ప్లాంట్కు సంబంధించి యంత్ర పరికరాల ఖర్చుకు వెనుకాడకుండా రూ.96 లక్షలతో సికింద్రాబాద్లోని లాండ్ స్కై కంపెనీతో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. ప్రతి గంటకు 45క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ సరఫరా చేస్తుందని, ప్రతి నిమిషానికి 750 లీటర్ల ఆక్సిజన్ను సరఫరా చేస్తుందని తెలిపారు. గాలిలోని ఆక్సిజన్ను గ్ర హించడం ద్వారా ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. టీబీజీకేఎస్ నాయకుడు కెంగర్ల మల్లయ్య, అధికారులు త్యాగరాజు, రామ్మూర్తి, నవీన్, మదన్మోహన్, లక్ష్మీనారాయణ, సిబ్బంది ఉన్నారు.