ఆసిఫాబాద్, నవంబర్ 22: జిల్లాలో చేపట్టనున్న పోడు భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎంపీడీవో, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సర్వేకు సంబంధించి విధివిధానాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పోడు భూముల సర్వే చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 263 గ్రామ పంచాయతీల్లో ఎస్టీలు 13,177 ఇతరులు 13, 503 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిని పరిశీలించి గ్రామ పంచాయతీల వారీగా ఎన్ని ైక్లెమ్స్ వచ్చాయి, ఎన్ని రోజుల సమయం పడుతుందన్న విషయాన్ని ప్రణాళికాబద్ధంగా తయారు చేయాలన్నారు. ఈ ైక్లెమ్స్లో ఎస్టీలకు సంబంధించి 51,859.33 ఎకరాల భూమి ఉండగా ఇతరులకు 44,267.05 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. గుర్తించిన గ్రామపంచాయతీల్లో హ్యాబిటేషన్ల వారీగా దరఖాస్తుదారుల భూమి వివరాలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు రాగానే సర్వే ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, అదనపు కలెక్టర్లు రాజేశం, వరుణ్రెడ్డి, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.