జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులతో సమావేశం
ఎదులాపురం, ఫిబ్రవరి 14 : ఈ నెల 23న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సేవాలాల్ జయంతి వేడుకల నిర్వహణపై ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఏడు సంవత్సరాల నుంచి అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకలకు సుమారు ఏడు వేల మంది హాజరు కానున్నారని తెలిపారు. ఉట్నూర్, ఇంద్రవెల్లిల్లో సేవాలాల్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు.
అలాగే భూములను కేటాయించాలని, స్థానికంగా సెలవు దినాన్ని ప్రకటించాలని కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను అధికారికంగా, బ్రహ్మాండంగా నిర్వహించాలని సూచించారు. అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి ఒ క్కరూ కొవిడ్ నిబంధనలు పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చే యాలన్నారు. ఐటీడీఏ పీవో అంకిత్ మాట్లాడుతూ.. జయంతి వేడుకల నిర్వహణకు వివిధ శాఖలకు కేటాయించిన పనులను చేపట్టాలని, వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు సంధ్యారాణి, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
త్వరితగతిన పనులు చేపడుతున్నాం..
జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద ప్రతి మండలంలో ఇంజినీరింగ్ శాఖ ద్వారా పనులు చేపడుతున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు ప్రారంభించుకునే పనులను చేపడుతున్నట్లు చెప్పారు. అందుకు సం బంధించిన అంచనాలు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలో 237 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చేపట్టడానికి నిర్ణయించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా విద్యా శాఖ అధికారి ప్రణీత, డీఆర్డీవో కిషన్, ఐటీడీఏ పీవో అంకిత్, జడ్పీ సీఈవో గణపతి, సెక్టోరియల్ అధికారి నర్సయ్య, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.