ఆసిఫాబాద్, అక్టోబర్ 21: పిల్లల్లో పోషకాహార లోపం నిర్మూలణకు చిరుధాన్యాలు ఎంతో ఉపయోగపడుతాయని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు అన్నారు. పట్టణంలోని 8 -అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు, పిల్లల తల్లులు, గర్భిణులు, బాలింతలకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన పిల్లలు ఎక్కువగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. దీనిని గుర్తించిన ప్రభు త్వం చిరుధాన్యాల పంపిణీని ప్రారంభించిందన్నారు. అంగన్వాడీ సిబ్బంది సక్రమంగా అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్హైమద్, సీడీపీవో రుక్సానా, అంగన్వాడీ టీచర్లు శశికళ, రూప, తదితరులు పాల్గొన్నారు.
నంబాల గ్రామంలో..
రెబ్బెన, అక్టోబర్ 21:పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నంబాల సర్పంచ్ చెన్న సోమశేఖర్ అన్నారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారలోపం నిర్మూలన డ్రైవ్లో భాగంగా గురువారం పోషకాహార లోపం గల పిల్లలు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అశోక్, పంచాయతీ కార్యదర్శి శివకృష్ణ పాల్గొన్నారు.
పులికుంటలో..
మండలంలోని పులికుంట అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై అవగాహన కల్పించారు. సర్పంచ్ బుర్స పోశమల్లు, ఉపసర్పంచ్ మల్రాజ్ శృతి, కార్యదర్శి గుగులోత్ సరిత, వార్డు సభ్యులు గణేశ్, సీత, గ్రామ సంఘం అధ్యక్షురాలు బుర్స లక్ష్మి పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రం తనిఖీ
మండలంలోని పుంజుమేరగూడ, దేవులగూడ అంగన్వాడీ కేంద్రాలను జడ్పీటీసీ వేముర్ల సంతోష్ గురువారం తనిఖీ చేశారు. పిల్లలకు పెడుతున్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్వాడీ టీచర్లు సాంబ లక్ష్మి, భాగ్యలక్ష్మి ఉన్నారు.
పోషకాహారం తీసుకోవాలి
కౌటాల, అక్టోబర్ 21: గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్, ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి అన్నారు. మండలంలోని గుడ్లబోరి గ్రామంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిరుధాన్యాలతో తయారు చేసే ఆహార పదార్థాలను వివరించారు. కార్యక్రమంలో వాసన్ జిల్లా కో ఆర్డినేటర్ సాయినాథ్, సర్పంచ్లు శ్రీనివాస్, నిహారిక, ఎంపీటీసీ వసంత్రావు, నాయకులు మధుకర్, ఉపసర్పంచ్ రాందాస్, ఏఈవో రాకేశ్, కార్యదర్శి సాయికృష్ణ, ఎస్హెచ్జీ గ్రూప్ మహిళలు, బాలింతలు, గర్భిణులు ఉన్నారు.