మంచిర్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతిని ధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ ని యోజకవర్గాల్లో పోటీకి 208 మంది నామినేషన్లు దా ఖలు చేశారు. రికార్డు స్థాయిలో 208 మంది అభ్యర్థులు 330 సెట్ల నామినేషన్ సెట్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కార్యాలయాల్లో అందజేశారు. అత్యధికంగా చె న్నూర్ నియోజకవర్గంలో 30 మంది నామినేషన్లు వేశా రు. బెల్లంపల్లి 25, ఆదిలాబాద్ 24, ముథోల్లో 23, మంచిర్యాల, కాగజ్నగర్ నియోజకవర్గాల్లో 21 చొప్పునన నామినేషన్లు పడ్డాయి.
అతి తక్కువగా బోథ్లో 14, ఆసిఫాబాద్లో 15 మంది నామినేషన్ వేశారు. బీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి భీ-ఫార్మ్ తీసుకొని నామినేషన్లు వేశారు. దాదాపు 79 మంది ఇండిపెండెంట్లుగా వేయగా, చెన్నూర్లో 12, ముథోల్లో 11, బెల్లంపల్లి, ఆదిలాబాద్లో 10 మంది చొప్పున, మంచిర్యాల, కాగజ్నగర్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున, నిర్మల్లో ఐదుగురు, భోథ్లో ముగ్గురు చొప్పున స్వతంత్య్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ నెల 13వ తేదీన పరిశీలన, 15వ తేదీన ఉపసంహరణ అనంతరం ఎం త మంది పోటీలో ఉంటారనే విషయంపై స్పష్టత రానున్నది.